ఎన్నికల క్యాడర్‌కు బైక్ ర్యాలీగా..

ఇవాళ జరిగే వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొంటున్నారు. కేటీఆర్ సన్నాహక సబ నేపథ్యంలో వరంగల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సభకు 25వేల మంది హాజరవుతారని తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్లో సన్నాహక సమాశాలు ముగిసిన నేపథ్యంలో ఆయన ఇవాళ వరంగల్లో పర్యటిస్తారు. O.C.T. మైదానంలో నిర్వహిస్తున్న […]

ఎన్నికల క్యాడర్‌కు బైక్ ర్యాలీగా..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:01 PM

ఇవాళ జరిగే వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొంటున్నారు. కేటీఆర్ సన్నాహక సబ నేపథ్యంలో వరంగల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సభకు 25వేల మంది హాజరవుతారని తెలిపారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్లో సన్నాహక సమాశాలు ముగిసిన నేపథ్యంలో ఆయన ఇవాళ వరంగల్లో పర్యటిస్తారు. O.C.T. మైదానంలో నిర్వహిస్తున్న సభలో పాల్గొంటారు.

వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా విడివిడిగా కేటీఆర్ సమావేశం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరు ఉండి పరిశీలిస్తున్నారు.

ముందు సభలో పాల్గొన్న కేటీఆర్ అక్కడ నుంచి బైక్ ర్యాలీ ద్వారా సిటీ మైదానానికి చేరుకుంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎర్రబెల్లి దయాకర్.