తొలి ఏకాదశి : ఇలా చేస్తే ఇంటి నిండా డబ్బే డబ్బు!
హిందూసంప్రదాయాల ప్రకారం తొలి ఏకాదశి పండుగకు చాలా విషిష్టత ఉంటుంది. ఈ రోజు ప్రజలందరూ విష్ణుమూర్తిని, లక్ష్మీ దేవిని నిష్టగా పూజిస్తుంటారు.అంతే కాకుండా ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలిఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు నేటి నుంచి నాలుగు నెలల వరకు నిద్రలోకి వెళ్తారు. అందువలన ఈ రోజున చాతుర్మసావ్రతం పాటిస్తుంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలు పాటించడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట. అవి :
Updated on: Jul 05, 2025 | 9:31 PM

హిందూసంప్రదాయాల ప్రకారం తొలి ఏకాదశి పండుగకు చాలా విషిష్టత ఉంటుంది. ఈ రోజు ప్రజలందరూ విష్ణుమూర్తిని, లక్ష్మీ దేవిని నిష్టగా పూజిస్తుంటారు.అంతే కాకుండా ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలిఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు నేటి నుంచి నాలుగు నెలల వరకు నిద్రలోకి వెళ్తారు. అందువలన ఈ రోజున చాతుర్మసావ్రతం పాటిస్తుంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలు పాటించడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట. అవి :

ఉపావాసం : తొలిఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్ర పరిచి ఉపావాసం ఉండాలంట. ఈ రోజు ఉపావాసం చేయడం చాలా మంచిదని చెబుతుంటారు పండితులు. అంతే కాకుండా చాలా పుణ్యం అంట. మరీ ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 24 ఏకాదశిలు ఉపావాసం ఉన్నంత పుణ్యం లభిస్తుందంట. అందుకే ఈ రోజు ఉపావాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట.

వ్రతాలు, పూజలు : తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లి పూజలు చేయడమే కాకుండా, తప్పకుండా కొన్ని రకాల వ్రతాలు ఆచరించాలంట. మరీ ముఖ్యంగా విష్ణుసహస్రనామం పారాయణం చేయడం లేదా సత్యనారాయణ వ్రతం ఆచరించడం, శ్రీ మహావిష్ణువుకు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంట.

తొలి ఏకాదశి రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలతో సతమతం అవుతున్నారో, అలాంటి వారు తొలి ఏకాదశి రోజున దక్షిణ వ్రత శంఖం, లేగతో ఉన్న ఆవు ప్రతిమను ఇంటికి తెచ్చుకోవాలంట.

దీని వలన ఇంటిలో సమస్యలు తీరిపోవడమే కాకుండా అపారమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకున్నవారు చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారంట. వీరికి ధనానికి, ధాన్యానికి లోటు అస్సలే ఉండదంట.



