Motorola: మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫోన్‌.. అండర్‌ వాటర్‌ ప్రొటెక్షన్‌ వంటి అడ్వాన్స్‌ ఫీచర్‌..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇటీవల బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఫోన్‌లన లాంచ్‌ చేస్తోంది. ముఖ్యంగా రూ. 25వేల లోపు బడ్జెట్‌ ఫోన్స్‌ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం...

|

Updated on: Sep 23, 2023 | 9:21 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి మోటోరోలో ఎడ్జ్‌ నియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 5జీ నెట్‌వర్క్‌కి ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి మోటోరోలో ఎడ్జ్‌ నియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 5జీ నెట్‌వర్క్‌కి ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది.

1 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను అండర్‌ వాటర్‌ ప్రొటెక్షన్‌ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతులో నీటిని ముంచేసినా మొబైల్ పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం ఐపీ68 సర్టిఫికేషన్‌ అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను అండర్‌ వాటర్‌ ప్రొటెక్షన్‌ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతులో నీటిని ముంచేసినా మొబైల్ పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం ఐపీ68 సర్టిఫికేషన్‌ అందించారు.

2 / 5
ఇక మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో స్మార్ట్‌ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ కర్వ్‌ర్డ్‌ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్ ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ను ఇచ్చారు.

ఇక మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో స్మార్ట్‌ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ కర్వ్‌ర్డ్‌ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్ ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ను ఇచ్చారు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో విడుదల చేశారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 23,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 25,999గా ఉంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో విడుదల చేశారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 23,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 25,999గా ఉంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది.

5 / 5
Follow us