Ravi Kiran |
Updated on: May 05, 2021 | 9:26 PM
Ipl
కరోనా కారణంగా ఐపీఎల్ కంటే ముందే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) వాయిదా పడింది. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా కరోనా కారణంగా రద్దైంది. డిసెంబర్ 2020న జరగాల్సిన ఈ సిరీస్లో ఇంగ్లాండ్ బృందం బస చేసిన హోటల్ సిబ్బంది సభ్యుడికి వైరస్ సోకింది. అదే సమయంలో, ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కూడా కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. ఈ కారణంగా, సిరీస్ను వాయిదా వేశారు.
ఈ ఏడాది టి20 ప్రపంచకప్ భారతదేశంలో జరగాల్సి ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, కరోనా సంక్షోభం కారణంగా నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ వాయిదా పడే అవకాశం ఉంది.