ఐపీఎల్ ను మాత్రమే కాదు.. ఈ టోర్నమెంట్లను సైతం కరోనా దెబ్బ తీసింది.. అవేంటంటే.!
కరోనావైరస్ క్రికెట్ రంగాన్ని బాగా దెబ్బతీసింది. దీని కారణంగా చాలా టోర్నమెంట్లు, లీగ్లు, సిరీస్లు రద్దు అయ్యాయి. అవేంటో లుక్కేద్దాం..

1 / 4

2 / 4

3 / 4

4 / 4
By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.
Updated on: May 05, 2021 | 9:26 PM

Ipl

కరోనా కారణంగా ఐపీఎల్ కంటే ముందే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) వాయిదా పడింది. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా కరోనా కారణంగా రద్దైంది. డిసెంబర్ 2020న జరగాల్సిన ఈ సిరీస్లో ఇంగ్లాండ్ బృందం బస చేసిన హోటల్ సిబ్బంది సభ్యుడికి వైరస్ సోకింది. అదే సమయంలో, ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కూడా కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. ఈ కారణంగా, సిరీస్ను వాయిదా వేశారు.

ఈ ఏడాది టి20 ప్రపంచకప్ భారతదేశంలో జరగాల్సి ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, కరోనా సంక్షోభం కారణంగా నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ వాయిదా పడే అవకాశం ఉంది.