AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022 Day 3, Schedule: పాక్‌తో కీలక మ్యాచ్‌లో తలపడనున్న భారత్.. 3వ రోజు షెడ్యూల్ ఇదే..

అదే సమయంలో టేబుల్ టెన్నిస్, హాకీలో కూడా భారత్ బరిలోకి దిగనుంది. జులై 31న వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షులి భారత్‌కు పతకాల సంఖ్యను పెంచగలరని భావిస్తున్నారు.

Venkata Chari
|

Updated on: Jul 30, 2022 | 9:08 PM

Share
కామన్వెల్త్ గేమ్స్ 2022 మూడో రోజున అందరి చూపు భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ పైనే ఉంటుంది. రెండో రోజులాగే మూడో రోజు కూడా వెయిట్ లిఫ్టర్లు భారత్ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో టేబుల్ టెన్నిస్, హాకీలో కూడా భారత్ బరిలోకి దిగనుంది. జులై 31న వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షులి భారత్‌కు పతకాల సంఖ్యను పెంచగలరని భావిస్తున్నారు.

కామన్వెల్త్ గేమ్స్ 2022 మూడో రోజున అందరి చూపు భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ పైనే ఉంటుంది. రెండో రోజులాగే మూడో రోజు కూడా వెయిట్ లిఫ్టర్లు భారత్ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో టేబుల్ టెన్నిస్, హాకీలో కూడా భారత్ బరిలోకి దిగనుంది. జులై 31న వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షులి భారత్‌కు పతకాల సంఖ్యను పెంచగలరని భావిస్తున్నారు.

1 / 5
హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలతో కూడిన భారత క్రికెట్ జట్టు, కామన్వెల్త్ గేమ్స్ 2022  మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. రెండో మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే మాత్రం.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు చాలా నష్టం కలుగుతుంది. భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలతో కూడిన భారత క్రికెట్ జట్టు, కామన్వెల్త్ గేమ్స్ 2022 మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. రెండో మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే మాత్రం.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు చాలా నష్టం కలుగుతుంది. భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

2 / 5
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత పురుషుల హాకీ జట్టు ఘనాతో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. పూల్ బిలో భారత జట్టు ఉంది. మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత పురుషుల హాకీ జట్టు ఘనాతో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. పూల్ బిలో భారత జట్టు ఉంది. మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.

3 / 5
పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు టేబుల్ టెన్నిస్‌లో జరుగుతుంది. మహిళల సెమీఫైనల్ మ్యాచ్ సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య జరగనుండగా, అంతకు ముందు భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో మలేషియాతో తలపడనుంది.

పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు టేబుల్ టెన్నిస్‌లో జరుగుతుంది. మహిళల సెమీఫైనల్ మ్యాచ్ సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య జరగనుండగా, అంతకు ముందు భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో మలేషియాతో తలపడనుంది.

4 / 5
మధ్యాహ్నం 2 గంటల నుంచి వెయిట్ లిఫ్టింగ్ మ్యాచ్ లు జరుగుతాయి. మహిళల 59 కేజీల విభాగంలో బిందియారాణి దేవి, పురుషుల 67 కేజీల్లో జెరెమీ, పురుషుల 73 కేజీల్లో అచింత షులి భారత్ తరపున బరిలోకి దిగనున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి వెయిట్ లిఫ్టింగ్ మ్యాచ్ లు జరుగుతాయి. మహిళల 59 కేజీల విభాగంలో బిందియారాణి దేవి, పురుషుల 67 కేజీల్లో జెరెమీ, పురుషుల 73 కేజీల్లో అచింత షులి భారత్ తరపున బరిలోకి దిగనున్నారు.

5 / 5