పాలలో అశ్వగంధ కలిపి తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
అశ్వగంధ ఒక శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. దీనిని ప్రతిరోజూ నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలతో తీసుకుంటే, అనేక సమస్యలను నయం చేస్తుంది. అశ్వగంధ, పాలు కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి బలం, శక్తి, మానసిక సమతుల్యతను ఇస్తుంది. అశ్వగంధ, పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం?
Updated on: Apr 17, 2025 | 5:37 PM

అశ్వగంధ అనేది ఒక ఆయుర్వేద మూలిక. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వినియోగిస్తున్నారు. ఇందులో నిద్రను ప్రేరేపించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. నిద్రలేమి సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు ప్రతిరోజు అశ్వగంధ పొడిని కలిపిన పాలు తాగడం మంచిదని చెబుతున్నారు.

మధుమేహ సమస్యల్నీ అశ్వగంధ నిరోధిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న పీసీఓడీ, ఇతరత్రా నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెనోపాజ్ సమయంలో తలెత్తే అనేక సమస్యలకు ఇది మందులా పనిచేస్తుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచడంలో పాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందులో అశ్వగంధను తీసుకుంటే ఎముకలు మరింత ధృడంగా మారుతాయి.

రాత్రి పడుకునే ముందు అశ్వగంధ పొడిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కండరాల అలసటను తగ్గిస్తుంది. శక్తిని పెంచుతుంది. ఆయుర్వేదంలో, అశ్వగంధను వృష్యం అంటే వీర్యాన్ని పెంచేదిగా పరిగణిస్తారు. పడుకునే ముందు పాలతో కలిపి తీసుకోవడం వల్ల స్పెర్మ్ నాణ్యత, పరిమాణం, శక్తి పెరుగుతుంది.

అశ్వగంధ కలిపిన పాలను తాగడం వల్ల నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక అలజడి తగ్గుతుంది. ఒత్తిడి నుంచి బయటపడేసే గుణాలు అశ్వగంధలో ఎక్కువ. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.

అశ్వగంధ, పాలు కలిపి తీసుకోవటం వల్ల బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల లేదా అనారోగ్యం తర్వాత కలిగే అలసటను తగ్గించడానికి ఉత్తమమైనదిగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు పాలతో అశ్వగంధను తీసుకోవడం వల్ల ఆకలి మెరుగుపడుతుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.




