Madras High Court: గుడిలోకి వితంతు మహిళ ప్రవేశం అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. ఏం చెప్పిందంటే
ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. వితంతువులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చట్టాల ద్వారా పారిపాలించబడుతున్న ఈ నాగరిక సమాజంలో జరగవని పేర్కొంది. ఓ వితంతు మహిళ వేసిన పిటీషన్పై ఇలా స్పందించింది. తమిళనాడులోకి ఈరోడ్ జిల్లాలో తంగంణి అనే వితంతు మహిళను పెరియాకారుపరాయణ్ ఆలయంలోకి వెళ్లకుండా కొందరు ఆపారు.
Updated on: Aug 05, 2023 | 9:49 PM

ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. వితంతువులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చట్టాల ద్వారా పారిపాలించబడుతున్న ఈ నాగరిక సమాజంలో జరగవని పేర్కొంది. ఓ వితంతు మహిళ వేసిన పిటీషన్పై ఇలా స్పందించింది.

తమిళనాడులోకి ఈరోడ్ జిల్లాలో తంగంణి అనే వితంతు మహిళను పెరియాకారుపరాయణ్ ఆలయంలోకి వెళ్లకుండా కొందరు ఆపారు. గతంలో ఆ టెంపుల్లో పనిచేసిన ఆమె భర్త 2017లో మరణించాడు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో కొడుకుతో కలిసి పాల్గొనాలని తంగమణి భావించింది.

కానీ వితంతువు కావడం వల్ల గుడిలోకి ప్రవేశం లేదని అడ్డుకున్నారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన మద్రాస్ హైకోర్టు.. వితంతువు ఆలయంలోకి వస్తే అపవిత్రం వస్తుందని ప్రాచీన నమ్మకం రాష్ట్రంలో ఉండటం ఎంతో దురదృష్టకరమని తెలిపింది.

ఈ నాగరిక సమాజంలో ఇలాంటివి సాగవని తీర్పునిచ్చింది. వితంతువులను ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఒక మహిళ తనకుంటూ ఒక హోదా, గుర్తింపును కలిగి ఉంటుందని చెప్పింది. ఆగస్టు 9, 10 వ తేదీల్లో జరిగే ఉత్సవాల్లో తంగమణి అలాగే ఆమె కుమారుడు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.




