AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గింజలను రాత్రంతా నానబెట్టి తినండి.. మీ ఆరోగ్యంలో అద్భుతాలు చూస్తారు.. ఎలాగో తెలుసుకోండి

నట్స్‌, సీడ్స్‌ రెండూ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇలాంటి చిరుధన్యాలు, డ్రైఫ్రూట్స్‌ వంటివి తినే ట్రెండ్ ఈ రోజుల్లో బాగా పెరిగింది. విత్తనాలు పరిమాణంలో చిన్నవి అయినప్పటికీ ప్రయోజనాల పరంగా అత్యంత ఆరోగ్యకరమైనవిగా చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ప్రతి విత్తనానికి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. చాలా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, కొన్ని విత్తనాలు రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని మీకు తెలుసా..? అలాంటి ఐదు రకాల సీడ్స్‌ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Feb 02, 2025 | 5:00 PM

Share
ధనియా వాటర్‌ - కొత్తిమీర గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా తీరుస్తుంది. నానబెట్టిన కొత్తిమీర గింజలను తినడం వల్ల గుండె జబ్బులు నయం అవుతాయి.

ధనియా వాటర్‌ - కొత్తిమీర గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా తీరుస్తుంది. నానబెట్టిన కొత్తిమీర గింజలను తినడం వల్ల గుండె జబ్బులు నయం అవుతాయి.

1 / 5
జీలకర్ర - జీలకర్ర కూడా అటువంటి మ్యాజికల్‌ సీడ్స్‌ అనే చెప్పాలి. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. జీకర్ర నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. నానబెట్టిన జీలకర్ర తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

జీలకర్ర - జీలకర్ర కూడా అటువంటి మ్యాజికల్‌ సీడ్స్‌ అనే చెప్పాలి. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. జీకర్ర నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. నానబెట్టిన జీలకర్ర తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

2 / 5
మెంతులు - ఈ గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. మెంతులు రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం వల్ల జీవక్రియను బలపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ గింజలను తినడం ద్వారా కూడా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే మెంతి నీరు తాగడం వల్ల అతిగా తినాలనే కోరికలు కూడా అదుపులో ఉంటాయి.

మెంతులు - ఈ గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. మెంతులు రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం వల్ల జీవక్రియను బలపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ గింజలను తినడం ద్వారా కూడా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే మెంతి నీరు తాగడం వల్ల అతిగా తినాలనే కోరికలు కూడా అదుపులో ఉంటాయి.

3 / 5
నువ్వులు- పాలలో కంటే నువ్వుల్లో ఎక్కువ కాల్షియం లభిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల కోసం నువ్వులు నానబెట్టిన నీటిని తాగడం మంచిది. రాత్రిపూట నానబెట్టిన నువ్వులను తినడం వల్ల మలబద్ధకం, అసిడిటీ సమస్యలు కూడా నయమవుతాయి. ఇలా తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

నువ్వులు- పాలలో కంటే నువ్వుల్లో ఎక్కువ కాల్షియం లభిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల కోసం నువ్వులు నానబెట్టిన నీటిని తాగడం మంచిది. రాత్రిపూట నానబెట్టిన నువ్వులను తినడం వల్ల మలబద్ధకం, అసిడిటీ సమస్యలు కూడా నయమవుతాయి. ఇలా తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

4 / 5
సెలెరీ- ఈ గింజలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. సెలెరీ వాటర్ తాగడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. సెలెరీ గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వాటి నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

సెలెరీ- ఈ గింజలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. సెలెరీ వాటర్ తాగడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. సెలెరీ గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వాటి నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

5 / 5
Follow Us