- Telugu News Photo Gallery Cricket photos WTC 2023 25 ICC announces full schedule for WTC 3rd Edition 9 teams played 68 test matches final in Lord s Cricket Ground
WTC 2023-25: 9 జట్లు 68 టెస్టు మ్యాచ్లు.. డబ్ల్యూటీసీ 3వ ఎడిషన్ షురూ.. టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఫైనల్ ఎక్కడంటే?
World Test Championship 2023-25: ఐసీసీ విడుదల చేసిన జాబితా ప్రకారం, తొమ్మిది జట్లు రెండేళ్లలో 27 సిరీస్లలో 68 టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నాయి. దీంతో డబ్ల్యూటీసీ 3వ ఎడిషన్ పూర్తవ్వనుంది.
Updated on: Jun 15, 2023 | 8:01 PM

టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా రెండో టెస్టు ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. దీంతో డబ్ల్యూటీసీ 2వ ఎడిషన్ ముగిసింది. ఇక తాజాగా 3వ ఎడిషన్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరు మొదలుకానుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్తో ప్రారంభం కానుంది.

ఈ విధంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ పూర్తి షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఈ ఎడిషన్లో ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు ఆడనుందో ప్రకటించింది. చివరిగా లార్డ్స్ మైదానంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు టైటిల్ కోసం పోరాడుతాయి.

ఐసీసీ విడుదల చేసిన జాబితా ప్రకారం రెండేళ్లలో 9 జట్లు 27 సిరీస్ల్లో 68 టెస్టు మ్యాచ్లు ఆడనున్నాయి. టోర్నీ మూడో ఎడిషన్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి.

ప్రతి WTC సిరీస్లో ఒక జట్టు ఒక సిరీస్లో రెండు నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడేందుకు అనుమతి ఉంటుంది. మొత్తంగా తొమ్మిది జట్లలో ఒక్కొక్కటి ఆరు సిరీస్లు ఆడనున్నాయి. వీటిలో మూడు సిరీస్లు స్వదేశంలో జరగనుండగా, మిగిలిన 3 సిరీస్లు విదేశాల్లో ఆడనున్నాయి.

2023 నుంచి 2025 వరకు ఈ మూడో ఎడిషన్లో భారత్ 19 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో వెస్టిండీస్తో 2, దక్షిణాఫ్రికాతో 2, ఇంగ్లండ్తో 5, బంగ్లాదేశ్తో 2, న్యూజిలాండ్తో 3 టెస్టు మ్యాచ్లు ఆడనున్నాయి. చివరగా ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్తో భారత్ తన డబ్ల్యూటీసీ ఎడిషన్ 2023-25ను ముగించనుంది.

పాకిస్థాన్ జట్టు కూడా 14 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్లు స్వదేశంలో తలపడనుండగా, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు విదేశాల్లో తలపడనుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ కూడా 19 మ్యాచ్లు ఆడనుంది. అందులో తొమ్మిది మ్యాచ్లు విదేశాల్లో, 10 మ్యాచ్లు స్వదేశంలో జరగనున్నాయి. ఇందుకోసం ఆసీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనుండగా.. భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్లతో సిరీస్లకు స్వదేశంలో ఆతిథ్యమివ్వనుంది.

బంగ్లాదేశ్ కూడా 12 మ్యాచ్లు ఆడుతుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక సిరస్లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్లలో పర్యటించనుంది.

ఇంగ్లండ్ 21 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. 10 స్వదేశంలో, 11 విదేశాలలో ఉండనున్నాయి. ఇది వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాలకు ఆతిథ్యం ఇస్తుంది. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్లతో సిరీస్లు ఆడేందుకు ఆయా దేశాలకు వెళ్లనుంది.

14 మ్యాచ్లు ఆడనున్న న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో తలపడనుంది.

దక్షిణాఫ్రికా 12 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. మూడు ఆసియా జట్లకు పాకిస్తాన్, శ్రీలంక, భారత్లతో సిరీస్లకు ఆతిథ్యం ఇస్తుంది. అలాగే, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్లతో సిరీస్ల కోసం పర్యటించనుంది.

లంక 12 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్లతో స్వదేశంలో, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లతో విదేశాల్లో తలపడుతుంది.

వెస్టిండీస్ 13 మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో స్వదేశంలో భారత్, ఆఫ్రికా, బంగ్లాదేశ్ దేశాలతో స్వదేశంలో ఆడనుండగా.. ఆసీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ దేశాల్లో పర్యటించనుంది.




