IND vs PAK: మరికొన్ని గంటల్లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. మోడీ స్టేడియానికి చేరుకున్న సచిన్, అనుష్క
మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా మరికొద్ది గంటల్లో అసలు సమరం ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థిపై గెలుపుకోసం టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. పాక్ను భారీ తేడాతో ఓడించి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. అందులోనూ ప్రపంచ కప్లో ఆడుతున్నాయంటే ఆ మ్యాచ్ కోసం సముద్రాలు దాటైనా అభిమానులు తరలివస్తారు. ఇవాళ్టి మ్యాచ్ కోసం అదే జరుగుతోంది. రసవత్తర పోరును కళ్లారా వీక్షించేందుకు జార్జియా, నేపాల్, ఇంగ్లండ్ సహా పలుదేశాల నుంచి అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
