AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున కెప్టెన్‌గా దుమ్ము రేపిన రోహిత్ శర్మ.. కేవలం 25 బంతుల్లోనే..

Rohit Sharma: హిట్‌మాన్ రోహిత్ శర్మ.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌తో కెప్టెన్‌గా రోహిత్ తన ప్రస్థానాన్ని..

Shiva Prajapati
|

Updated on: Dec 13, 2021 | 9:33 AM

Share
Rohit Sharma: హిట్‌మాన్ రోహిత్ శర్మ.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌తో కెప్టెన్‌గా రోహిత్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు. అయితే, 4 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ నెలలో.. తొలిసారిగా వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేజిక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఆ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పరుగుల తుపాను సృష్టించాడు. హిట్‌మాన్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు.

Rohit Sharma: హిట్‌మాన్ రోహిత్ శర్మ.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌తో కెప్టెన్‌గా రోహిత్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు. అయితే, 4 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ నెలలో.. తొలిసారిగా వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేజిక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఆ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పరుగుల తుపాను సృష్టించాడు. హిట్‌మాన్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు.

1 / 5
సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 13 డిసెంబర్ 2017. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు కెప్టెన్సీ వహించాడు.ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే ఔటైనా.. ధర్మశాలలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తి భిన్నమైన ప్రదర్శన చూపాడు. రీవేంజ్ తీర్చుకున్న మాదిరిగా డబుల్ సెంచరీ సాధించాడు.

సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 13 డిసెంబర్ 2017. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు కెప్టెన్సీ వహించాడు.ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే ఔటైనా.. ధర్మశాలలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తి భిన్నమైన ప్రదర్శన చూపాడు. రీవేంజ్ తీర్చుకున్న మాదిరిగా డబుల్ సెంచరీ సాధించాడు.

2 / 5
దీంతో ఇప్పటి వరకు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓపెనింగ్‌లో రోహిత్ కేవలం 153 బంతుల్లో 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో రోహిత్ కేవలం 25 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్ల సహాయంతో 124 పరుగులు చేశాడు.

దీంతో ఇప్పటి వరకు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓపెనింగ్‌లో రోహిత్ కేవలం 153 బంతుల్లో 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో రోహిత్ కేవలం 25 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్ల సహాయంతో 124 పరుగులు చేశాడు.

3 / 5
రోహిత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా 70 బంతుల్లో 88 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ కూడా 68 పరుగులు చేశాడు. భారత్ 4 వికెట్ల నష్టానికి 392 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దాదాపు శ్రీలంక బౌలర్లందరినీ చెడుగుడు ఆడుకున్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో సినిమా చూపించారు. అతను వేసిన 10 ఓవర్లలో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 106 పరుగులు చేశారు.

రోహిత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా 70 బంతుల్లో 88 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ కూడా 68 పరుగులు చేశాడు. భారత్ 4 వికెట్ల నష్టానికి 392 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దాదాపు శ్రీలంక బౌలర్లందరినీ చెడుగుడు ఆడుకున్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో సినిమా చూపించారు. అతను వేసిన 10 ఓవర్లలో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 106 పరుగులు చేశారు.

4 / 5
భారత్ స్కోరు ముందు శ్రీలంక బేజార్ అయిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఒత్తిడికి లోనవడంతో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రమే పోరాడి 111 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మొత్తం జట్టు 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్ 60 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 141 పరుగుల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది.

భారత్ స్కోరు ముందు శ్రీలంక బేజార్ అయిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఒత్తిడికి లోనవడంతో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రమే పోరాడి 111 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మొత్తం జట్టు 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్ 60 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 141 పరుగుల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది.

5 / 5
Follow Us
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం