- Telugu News Photo Gallery Cricket photos MS Dhoni Business: Dhoni's charm even on the business field, see 7 investments of MSD in pictures
MS Dhoni Business: ధోని ఆటలోనే కాదు.. వ్యాపారంలోనూ ‘ది ఫస్ట్’.. మిస్టర్ కూల్ పెట్టుబడులు తెలిస్తే షాకే..!
MS Dhoni Investments: క్రికెట్తో పాటు, వ్యాపార రంగంలో కూడా మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బ్రాండ్ అంబాసిడర్గా, పెట్టుబడిదారుడిగా వ్యవహరిస్తూ క్రికెటర్లందరిలో అత్యధికంగా ఆర్జిస్తున్నాడు. ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా, పార్ట్నర్గా ఉన్న అనేక బ్రాండ్స్ ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
Updated on: May 29, 2023 | 9:39 PM

MS Dhoni Investments: క్రికెట్తో పాటు, వ్యాపార రంగంలో కూడా మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బ్రాండ్ అంబాసిడర్గా, పెట్టుబడిదారుడిగా వ్యవహరిస్తూ క్రికెటర్లందరిలో అత్యధికంగా ఆర్జిస్తున్నాడు. ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా, పార్ట్నర్గా ఉన్న అనేక బ్రాండ్స్ ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. మరోసారి తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను ఐపీఎల్లో ఫైనల్కు చేర్చాడు. అయితే ధోనీ కేవలం క్రికెట్ ఫీల్డ్కే పరిమితం కాలేదు. వ్యాపారం, పెట్టుబడి రంగాల్లోనూ ధీటుగా సాగిపోతున్నాడు.

ధోనీ ఇన్వెస్ట్మెంట్ స్కోర్కార్డ్ (ధోని ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో)లో సరికొత్త పేరు చేరింది. అదే ‘గరుడ ఏరోస్పేస్’. ఈ కంపెనీ డ్రోన్ వ్యాపారంలో రాణిస్తోంది. ధోని గత సంవత్సరం ఇందులో పెట్టుబడి పెట్టాడు. కంపెనీకి పెట్టుబడిదారుడుగా ఉండటంతో పాటు.. దాని బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ 2015లో ప్రారంభమైంది. తక్కువ బడ్జెట్లో డ్రోన్ సంబంధిత సమస్యల పరిష్కారాలను అందించడంపై కంపెనీ ఫోకస్ పెట్టింది.

మహేంద్ర సింగ్ ధోనీ ‘హోమ్లేన్’ కంపెనీలో 2021లో పెట్టుబడి పెట్టాడు. హోమ్లేన్.. ఇంటీరియర్ డెకరేషన్కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ. ధోనీ దాని బ్రాండ్ అంబాసిడర్, ఈక్విటీ భాగస్వామి. ఈ కంపెనీ 2014లో ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ NCR, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కతా సహా 16 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

ధోనీ మార్చి 2020లో ఫిన్టెక్ కంపెనీ ఖాతాబుక్ తో బ్రాండ్ అంబాసిడర్గా అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంతేకాదు.. కంపెనీలో పెట్టుబడులు కూడా భారీగానే పెట్టాడు. ఈ స్టార్టప్ కంపెనీ MSME రంగానికి సేవలను అందిస్తుంది.

కార్స్24 అనే కంపెనీ కూడా ధోనీ వ్యాపార సంస్థలో ఒకటి. ధోని ఆగస్ట్ 2019లో దీని బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. దీంతో పాటు, కార్స్ 24 లో పెట్టుబడి కూడా పెట్టాడు. సిరీస్ D రౌండ్ ఫండింగ్ కింద కార్స్24లో పెట్టుబడి పెట్టాడు. ఈ సంస్థ 2015 సంవత్సరంలో ప్రారంభమైంది.

‘సెవెన్’ పేరుతో ఫ్యాషన్, లైఫ్స్టైల్ బ్రాండ్ను ప్రారంభించాడు ధోనీ. కంపెనీ పాదరక్షల బ్రాండ్ మాస్టర్స్ట్రోక్లో ధోనీ అత్యధిక వాటాను కలిగి ఉన్నాడు. అలాగే, ఆర్ఎస్ సెవెన్ లైఫ్స్టైల్ కంపెనీకి చెందినది. సెవెన్ బ్రాండ్కు ధోనీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ కూడా.

ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త మోహిత్ భాగ్చందానీ ఫుడ్ అండ్ బెవరేజెస్ స్టార్టప్ 7ఇంక్ బ్రూస్ను ప్రారంభించారు. ఇందులో ధోనీకి కూడా వాటా ఉంది. ఈ కంపెనీ చాక్లెట్ నుండి అనేక రకాల డ్రింక్స్ను తయారు చేస్తుంది. ధోని ప్రసిద్ధ హెలికాప్టర్ షాట్ పేరుతో కంపెనీ Copter7 చాక్లెట్ బ్రాండ్ను కూడా విడుదల చేసింది.

ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో సహాయపడే టెక్ కంపెనీ రన్ ఆడమ్ కూడా ధోని పెట్టుబడి పోర్ట్ఫోలియోలో చేరింది. ధోనీ ఆగస్ట్ 2018లో రన్ ఆడమ్లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీలో ధోనీకి 25 శాతం వాటా ఉంది. ధోనీ ఈ కంపెనీకి పెట్టుబడిదారుడు, మెంటార్, బ్రాండ్ అంబాసిడర్ కూడా.





























