IPL 2024: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు వీడ్కోలు పలుకుతాడా? ఈ ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. అది కూడా రోహిత్ శర్మ నోటి నుంచే రావడం విశేషం. అంటే, ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వైదొలగాలని హిట్ మ్యాన్ కీలక స్టేట్మెంట్ ఇచ్చాడు.
శనివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ తన మాజీ క్లాస్మేట్, KKR అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ను కలిశాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టులో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరూ మాట్లాడారు.
అభిషేక్తో మాట్లాడుతూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. ఈ క్రమంలో ముంబైలో ఇదే నా చివరి సీజన్ అంటూ రోహిత్ శర్మ తెలిపాడని వార్తలు వస్తున్నాయి.
అదేమిటంటే, ఇక్కడ అభిషేక్ నాయర్, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ గురించి చర్చించారు. ఈ క్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. నేను నిర్మించిన ముంబై ఇండియన్స్ జట్టులో ప్రతిదీ మారుతోంది. ఇప్పుడు ఏమి చేయాలో నాకు తెలియదు. ముంబై ఇండియన్స్కు ఇదే నా చివరి సీజన్ అని చెబుతన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్లేషిస్తున్నారు.
ఆశ్చర్యకరంగా, రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్ మధ్య జరిగిన ఈ సంభాషణ వీడియోను KKR వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో దాన్ని డిలీట్ చేశారు.
ఈ వీడియోలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడినట్లు స్పష్టమైంది. ఆ విధంగా అది తొలగించారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ శర్మ ఔట్ కావడం ఖాయం. కాబట్టి, హిట్మ్యాన్ కొత్త జట్టు కోసం ఆడేందుకు IPL 2025 కోసం ఎదురుచూడొచ్చు.