Ravi Kiran |
Updated on: Sep 19, 2021 | 10:23 AM
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ యూఏఈలో ఆదివారం 19 సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఈ సెకండ్ ఫేజ్లో మిగిలిన 31 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఆదివారం నుండి దుబాయ్, షార్జా, అబుదాబి క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ పలు రికార్డులను కొల్లగొట్టనున్నాడు.
రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో 400 సిక్సర్ల రికార్డుకు చేరువలో ఉన్నాడు. కేవలం 3 సిక్సర్లు కొడితే చాలు.. రోహిత్ శర్మ టీ20ల్లో 400 సిక్సర్ల మార్క్ చేరుకుంటాడు. ప్రస్తుతం రోహిత్ 350 మ్యాచ్లలో 397 సిక్సర్లు కొట్టాడు.
ఈ రేసులో మిగతా ఇండియన్ బ్యాట్స్మెన్ల కంటే ముందు ఉన్నాడు. నెంబర్ 2లో సురేశ్ రైనా ఉన్నాడు. అతడు 331 టీ20 మ్యాచ్ల్లో 324 సిక్సర్లు కొట్టాడు.
Virat Kohli
ఈ జాబితాలో ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 338 మ్యాచ్లలో 303 సిక్సర్లు మాత్రమే సాధించాడు.