రీసెంట్ బ్లాక్ బస్టర్ ఛావాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఇతనేనా?
ప్రస్తుతం అందరినోటా ఛావా మూవీ మాటే వస్తుంది. హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజై రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటి అనేగా మీ ఆలోచనా? అది ఏమిటంటే? రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అయినా ఛావాను టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్నారంట. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?
Updated on: Feb 17, 2025 | 11:14 AM

మరఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారం తెరకెక్కిన సినిమా ఛావా. ఈ మూవీ ఫిబ్రవరి14న రిలీజై కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు.

నేషనల్ క్రష్ రష్మిక ఛావా మూవీలో యేసు బాయ్ గా కనిపించగా, విక్కి కౌశల్ శంభాజీ పాత్రలో కనిపించారు. ఇక వీరు మూవీలో తమ నటనతో అదరగొట్టారనే చెప్పాలి. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ అద్భుతంగా నటించారంటూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుటున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా చూస్తూ, ఇందులో కొన్ని సన్నివేశాలను చూసి చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. అంతలా మూవీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయింది.

అయితే తాజాగా ఛావా మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఛావా మూవీని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మిస్ చేసుకున్నారంట.

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమా కథను మొదటగా మహేష్ బాబుకు వినిపించాడంట. కానీ కథ విన్న తర్వాత ఈ సినిమాను చేయడానికి సూపర్ స్టార్ ఆసక్తి చూపలేదంట. దీంతో చాలా రోజుల వరకు కథను తన వద్దే పెట్టుకున్న డైరెక్టర్ ఒక రోజు విక్కీ కౌశల్ కు కథ చెప్పడంతో బాగుందని ఒకే చేశాడంట. అలా సూపర్ స్టార్ చేయాల్సిన మూవీ, బాలీవుడ్ హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.