జూనియర్ ఎన్టీఆర్ అయన కుటుంబ సమేతంగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓబుల్ రెడ్డి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం క్యూలో నిలబడి తన ఓటును వినియోగించుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసమే నంద్యాల వెళ్లినట్టు తెలిపారు బన్నీ. అందరు ఓటును ఉపయోగించుకోవాలని సూచించారు.
తాజాగా ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ తిరిగివచ్చిన మెగాస్టార్ చిరంజీవి సతిమని సురేఖతో కలిసి జూబ్లీ హిల్స్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ మంగళగిరి పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పటికీ పవన్ మాత్రమే ఓటు వేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ నరేష్ నానక్ రామ్ గుడాలో పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నరు. దేశ భవిష్యత్తు కోసం ఓటు వేసినట్టు తెలిపారు. ఓటు వేసి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి అన్నారు.
తెలుగు చలనచిత్రాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన సతీమణి రామ రాజమౌళితో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సిరా ఉన్న వేలు చూపిస్తున్న ఓ ఫొటో షేర్ చేసారు.
వీరుమాత్రమే కాదు నాటు నాటు పాటతో ఆస్కార్ అందున్న ఎమ్.ఎమ్. కీరవాణి కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. కెమెరాలు అతని వైపు ఫోకస్ చేయడంతో దయచేసి నాకు అంత హైప్ ఇవ్వొద్దు అన్నారు.