- Telugu News Photo Gallery Cinema photos SSMB 29 Movie to Priyamani latest movie news from Tollywood Film Industry
Cinema News: ఇది నిజమేనా జక్కన్నా? ఎజెండా మార్చిన ప్రియమణి!
ఘ్గట్టమనేని సైన్యానికి గుడ్ న్యూస్ అంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులోనూ అది ఎస్ ఎస్ ఎంబీ 29కి సంబంధించింది. నేషనల్ క్రష్ కాదు.. ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక అని పిలిపించుకునే రోజు అతి త్వరలోనే రానుంది. క్లిక్ అయిన సినిమాలో స్క్రీన్ మీద ఒక్కరే కనిపిస్తే, ఆ క్రెడిట్ ఇచ్చే కిక్కే వేరు. సక్సెస్ పార్టీల్లో చెలరేగిపోవచ్చు. అయితే కొన్ని సార్లు, కథ డిమాండ్ని బట్టి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సిన ప్రతిసారీ హాయిగా, హ్యాపీగా ముందుకొస్తున్నారు ప్రియమణి.
Updated on: Mar 03, 2024 | 1:35 PM

ఘ్గట్టమనేని సైన్యానికి గుడ్ న్యూస్ అంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులోనూ అది ఎస్ ఎస్ ఎంబీ 29కి సంబంధించింది. అడ్వంచరస్ యాక్షన్ సినిమాగా ఇప్పటికే జనాల్లో ఉంది ఈ ప్రాజెక్ట్. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు జనాలు. ఏప్రిల్ 9న ఈ సినిమాను అనౌన్స్ చేస్తారని టాక్.

సూపర్స్టార్ సినిమా అనౌన్స్ మెంట్ ఉగాది రోజున చేయాలనే సంకల్పంతో పనిచేస్తోందట టీమ్. ముందు సినిమాను గ్రాండ్గా అనౌన్స్ చేస్తారట. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తారట. ఆల్రెడీ కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేశారు. డైరక్షన్ డిపార్ట్ మెంట్ లొకేషన్లు కూడా ఫైనల్ చేసేసిందని వినికిడి.

నేషనల్ క్రష్ కాదు.. ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక అని పిలిపించుకునే రోజు అతి త్వరలోనే రానుంది. రీసెంట్ జపాన్ విజిట్లో రష్మికకు అందిన వెల్కమ్ చూసిన వారందరిదీ ఇప్పుడు ఇదే ఒపీనియన్. టోక్యో క్రంచీ రోల్ అనిమే అవార్డుల వేడుక కోసం జపాన్కి వెళ్లారు రష్మిక. అక్కడ ఆమె ఫ్యాన్స్ శ్రీవల్లి అంటూ ఫొటోలు పట్టుకుని ఘన స్వాగతం పలికారు. మన దేశం నుంచి ఈ ఈవెంట్కి హాజరైన ఫస్ట్ లేడీ సెలబ్రిటీ రష్మిక. జపాన్లో ఇంత మంది అభిమానుల్ని చూస్తుంటే, నోట మాట రావట్లేదు. అందరూ నా మనసును గెలుచుకున్నారని పోస్ట్ చేశారు రష్మిక మందన్న. ప్రస్తుతం పుష్ప సీక్వెల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఆల్రెడీ యానిమల్ సినిమా సక్సెస్ జోష్లో ఉన్నారు మిస్ మందన్న.

క్లిక్ అయిన సినిమాలో స్క్రీన్ మీద ఒక్కరే కనిపిస్తే, ఆ క్రెడిట్ ఇచ్చే కిక్కే వేరు. సక్సెస్ పార్టీల్లో చెలరేగిపోవచ్చు. అయితే కొన్ని సార్లు, కథ డిమాండ్ని బట్టి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సిన ప్రతిసారీ హాయిగా, హ్యాపీగా ముందుకొస్తున్నారు ప్రియమణి. రీసెంట్గా జవాన్ సినిమాలో అంత మంది అమ్మాయిల మధ్య కీ రోల్ చేశారు. ఇప్పుడు భామాకలాపం2లోనూ, ప్రియమణితో శరణ్య కనిపిస్తూనే ఉంటారు.

అటు ఆర్టికల్ 370లో యామీ గౌతమ్ కీలక పాత్రలో కనిపించారు. స్క్రీన్మీదే కాదు, ఆన్సెట్లోనూ ఇంకో ఆర్టిస్ట్ ఉంటే ఆనందంగా ఉందని అంటున్నారు ప్రియమణి. ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదో తనకు తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం ఇద్దరు అమ్మాయిలు సెట్లో ఉన్నప్పుడు చాలా విలువైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నట్టు చెప్పారు. ఒకరి బాగోగులు, కంఫర్ట్ లెవల్స్ గురించి ఇంకొకరు పట్టించుకోవడం హ్యాపీగా అనిపిస్తోందని చెప్పారు.




