- Telugu News Photo Gallery Cinema photos Sapta Saagaralu Dhaati Side B to Month of Madhu latest movie updates from tollywood
Movie Updates: ‘సప్తసాగరాలు దాటి సైడ్ -బి’ నుంచి తాజా అప్డేట్.. ఓటిటిలోకి మంత్ ఆఫ్ మధు..
ఇండియా జాయ్, ప్లయింగ్ మౌంటెన్ కాన్సెప్ట్స్ సంయుక్తంగా సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమాన్ని హైదరాబాద్ నోవెటల్లో ఘనంగా నిర్వహించారు. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ ఆర్ రావు తెరకెక్కించిన 'సప్తసారగాలు దాటి' -'సైడ్ -ఏ'. తాజాగా దీనికి సీక్వెల్ వస్తుంది. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా అలా నిన్ను చేరి. సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వస్తున్న మూడో సినిమా యానిమల్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Nov 01, 2023 | 4:10 PM

ఇండియా జాయ్, ప్లయింగ్ మౌంటెన్ కాన్సెప్ట్స్ సంయుక్తంగా సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమాన్ని హైదరాబాద్ నోవెటల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో సినిమా రంగంలోని 24 శాఖలకు సంబంధిచిన సరికొత్త టెక్నికల్ హంగుల గురించి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున.. ఇండియన్ సినిమాటిక్ కాపిటల్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా ఆహా ఓటీటీలో నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించారు.

రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ ఆర్ రావు తెరకెక్కించిన 'సప్తసారగాలు దాటి' -'సైడ్ -ఏ'. ఈ సినిమాకు తెలుగులోనూ ప్రశంసలు వచ్చాయి. తాజాగా దీనికి సీక్వెల్ వస్తుంది. 'సప్తసాగరాలు దాటి సైడ్ -బి'గా దీన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. నువ్వే నువ్వే అంటూ సాగే ఈ పాట పూర్తిగా ఎమోషనల్గా సాగింది.

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా అలా నిన్ను చేరి. ఈ మధ్యే క్రిష్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. నవంబర్ 10న అలా నిన్ను చేరి విడుదల కానుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వస్తున్న మూడో సినిమా యానిమల్. కంటెంట్ పరంగా ఇప్పటికే చాలా చూపించారు ఈ దర్శకుడు. తాజాగా రన్ టైమ్ పరంగానూ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివితో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డిని కూడా సందీప్ నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నారు.. కానీ చివరికి మూడు గంటలకు కుదించారు.





























