- Telugu News Photo Gallery Cinema photos Rajamouli, Venkatesh, Poonam Kaur and other celebrities cast their votes see photos
Telangana Elections: ‘ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’.. ఓపికగా క్యూలో నిలబడి ఓటేస్తోన్న సినీ ప్రముఖులు.. ఫొటోస్
తెలంగాణలో ఓట్ల పండగ జోరుగా సాగుతోంది. గురువారం (నవంబర్ 30) ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయిస్తున్నా ఓపికగా క్యూ లైన్లలో నిలబడి మరీ తమ ఓటు బాధ్యతను పూర్తి చేసుకుంటున్నారు.
Updated on: Nov 30, 2023 | 10:58 AM

తెలంగాణలో ఓట్ల పండగ జోరుగా సాగుతోంది. గురువారం (నవంబర్ 30) ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయిస్తున్నా ఓపికగా క్యూ లైన్లలో నిలబడి మరీ తమ ఓటు బాధ్యతను పూర్తి చేసుకుంటున్నారు.

పాఠశాల విద్య నుంచే ఓటు విలువను తెలియజేయాలన్నారు ప్రముఖ దర్శకుడు రాఘ వేంద్రరావు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడిన దర్శకేంద్రుడు మనం ఏది అడగాలన్నా ఓటు వేసే హక్కు ఉండాలన్నారు. ఇక వెంకటేష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అంతకు ముందు ఉదయాన్నే హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు.

షేక్పేట ఇంటర్నేషనల్ స్కూల్లో సతీమణి రమతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే దర్శకుడు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ క్లబ్లో పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు హీరో నితిన్ తదితర ప్రముఖులందరూ ఇక్కడే ఓటు వేశారు.

ఇక హీరోయిన్ పూనమ్ కౌర్, హీరో దగ్గుబాటి రానా తదితర ప్రముఖులు కూడా తమ ఓటు బాధ్యతను పూర్తి చేశారు. అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును పూర్తి చేయాలన్నారు.

హీరో శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఆయన వెంట సతీమణి ఊహ, కుమారుడు హీరో రోషన్ ఉన్నారు. శివాజీ రాజా కూడా ఓటింగ్లో పాల్గొన్నారు.

ఇక సోషల్ మీడియా సెలబ్రిటీ, కోల్హాపూర్ నియోజక వర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు.

ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఓటు విలువ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఓటుపై అవగాహన కోసం పాఠ్యాంశంగా చేర్చాలన్నారు.

తమ కుటుంబంతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల
