అక్కినేని వారింట పెళ్లి భాజాలు మోగాయి. చాలా రోజులుగా ట్రెండింగ్లో ఉన్న చైతూ, శోభిత ధూళిపాళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
రెండేళ్ళ ప్రేమకు పెళ్లితో శుభం కార్డ్ వేసారు ఈ జంట. మరి చైతూ, శోభిత పెళ్లికి ఎవరెవరు వచ్చారు..? ఎలా జరిగింది..? అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం ఘనంగా జరిగింది.
రాత్రి 8 గంటల 13 నిమిషాలకు సాంప్రదాయ బద్ధంగా పెళ్లి వేడుకను నిర్వహించారు. గత మూడు రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తాజాగా పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని కుటుంబం సెంటిమెంట్గా భావించే అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ వేదికను సిద్ధం చేశారు. ఇరు కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
అక్కినేని ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన 300 మంది సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందినట్టుగా తెలుస్తోంది. రెండేళ్ళ కింద ఓ ఓటీటీ షోలో తొలిసారిగా శోభితను కలుసుకున్నారు నాగ చైతన్య.
కొద్ది నెలల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళ నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఘనంగా పెళ్లి జరిగింది.