Movie Sequals: బాహుబలితో మొదలైన ట్రెండ్.. అదే ఫార్ములా ఫాలో అవుతున్న మేకర్స్..
ఒకే సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఆడియన్స్ను వెయిటింగ్లో పెట్టాలంటే తొలి భాగం క్లైమాక్స్ ఆడియన్స్కు ఆ రేంజ్లో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఆ పాయింట్ మీదే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్లోనూ ఆ పాయింట్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. బాహుబలితో ఒకే కథను రెండు భాగాలుగా చెప్పి కూడా ఆడియన్స్ను మెప్పించవచ్చని ప్రూవ్ చేశారు రాజమౌళి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Dec 26, 2023 | 3:40 PM

ఒకే సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఆడియన్స్ను వెయిటింగ్లో పెట్టాలంటే తొలి భాగం క్లైమాక్స్ ఆడియన్స్కు ఆ రేంజ్లో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఆ పాయింట్ మీదే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్లోనూ ఆ పాయింట్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది.

బాహుబలితో ఒకే కథను రెండు భాగాలుగా చెప్పి కూడా ఆడియన్స్ను మెప్పించవచ్చని ప్రూవ్ చేశారు రాజమౌళి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో బాహుబలిని కట్టప్పే చంపటం అనే పాయింట్తో రెండేళ్ల పాటు ఆడియన్స్లో క్యూరియాసిటీని అలాగే మెయిన్టైన్ చేయగలిగారు.

కేజీఎఫ్ పార్ట్ 2 మీద పాన్ ఇండియా రేంజ్లో హైప్ రావడానికి కారణం కూడా ఫస్ట్ పార్ట్ క్లైమాక్సే. నారాచీ గెలిచిన రాకీభాయ్కి ఎదురవ్వబోయే మరో ప్రమాదం ఏంటీ... రాక్షసుడి లాంటి రాకీభాయ్ని కూడా భయపెట్టేది ఎవరు? అన్న పాయింట్ ఆడియన్స్ను వెయిట్ చేసేలా చేసింది.

రిలీజ్కు రెడీ అవుతున్న సీక్వెల్స్ విషయంలోనూ ఈ అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప పార్ట్ వన్ క్లైమాక్స్లోనే అసలు కథ మొదలైంది. హీరో, విలన్ ముఖాముఖి తలపడే తొలి సీనే, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కావటంతో సీక్వెల్ కోసం ఐకాన్ స్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

సలార్ సినిమాను కూడా అలాంటి ఇంట్రస్టింగ్ ట్విస్ట్తోనే ముగించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ కేజీఎఫ్తో సక్సెస్ అయిన ఫార్ములాను మరోసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంతో పార్ట్ 2 కోసం ఆల్రెడీ వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్.





























