AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : దేశాన్ని కుదిపేసిన క్రిమినల్ కేసు.. రియాల్టీ స్టోరీతో 53 ఏళ్లల్లో 3 సినిమాలు వచ్చాయి.. ప్రతీ మూవీ సెన్సేషన్..

సాధారణంగా రియాల్టీ స్టోరీలతో వచ్చిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇదే క్రమంలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, సంచలనాత్మక కేసుల ఆధారంగా మూడు సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఈ కేసు ఆధారంగా వచ్చిన చిత్రానికి బాలీవుడ్ నటుడు జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

Rajitha Chanti
|

Updated on: Sep 14, 2026 | 8:39 PM

Share
ఇప్పటివరకు సినీ పరిశ్రమలో నిజ సంఘటనల ఆధారంగా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఊహించని విజయాన్ని అందుకున్నాయి. భారతదేశ చరిత్రలో అలాంటి ఒక కేసు ఉంది. అది ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ హై ప్రొఫైల్ కేసు ఆధారంగా ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా ప్రజాదరణ పొందాయి. అంతేకాదు, ఈ కేసు ఆధారంగా వచ్చిన సినిమాకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నేరుగా జాతీయ అవార్డును అందుకున్నారు.

ఇప్పటివరకు సినీ పరిశ్రమలో నిజ సంఘటనల ఆధారంగా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఊహించని విజయాన్ని అందుకున్నాయి. భారతదేశ చరిత్రలో అలాంటి ఒక కేసు ఉంది. అది ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ హై ప్రొఫైల్ కేసు ఆధారంగా ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా ప్రజాదరణ పొందాయి. అంతేకాదు, ఈ కేసు ఆధారంగా వచ్చిన సినిమాకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నేరుగా జాతీయ అవార్డును అందుకున్నారు.

1 / 5
ఒక నావికాదళ అధికారి కాల్చిన మూడు తూటాలు, ఆ తర్వాత ముంబై కోర్టులో జరిగిన కేసు, దేశ న్యాయవ్యవస్థ గమనాన్ని మార్చివేశాయి. 1959 నాటి 'కె. ఎం. నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర' కేసు భారత నేర, న్యాయ చరిత్రలో అక్షరాలా ప్రకంపనలు సృష్టించింది. దేశ భద్రత కోసం నావికాదళంలో నియమితులైన కమాండర్ కవాస్ మాణెక్‌షా నానావతి, తన భార్య ప్రియుడైన ప్రేమ్ అహుజాను కాల్చి చంపారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించిన కేసు.

ఒక నావికాదళ అధికారి కాల్చిన మూడు తూటాలు, ఆ తర్వాత ముంబై కోర్టులో జరిగిన కేసు, దేశ న్యాయవ్యవస్థ గమనాన్ని మార్చివేశాయి. 1959 నాటి 'కె. ఎం. నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర' కేసు భారత నేర, న్యాయ చరిత్రలో అక్షరాలా ప్రకంపనలు సృష్టించింది. దేశ భద్రత కోసం నావికాదళంలో నియమితులైన కమాండర్ కవాస్ మాణెక్‌షా నానావతి, తన భార్య ప్రియుడైన ప్రేమ్ అహుజాను కాల్చి చంపారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించిన కేసు.

2 / 5
ఈ కేసు అప్పటి ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అపారమైన జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. నానావతికి కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ, ఆయనపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం, సానుభూతి కారణంగా ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ విజయలక్ష్మి పండిట్ ఆయన శిక్షను తగ్గించారు. ఈ ప్రసిద్ధ కేసు బాలీవుడ్‌ను కూడా ఎంతగానో ఆకర్షించింది. ఈ కేసు ఆధారంగా గత 50 ఏళ్లలో, ముగ్గురు వేర్వేరు దర్శకులు ఇదే కేసుపై గొప్ప చిత్రాలను రూపొందించారు.

ఈ కేసు అప్పటి ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అపారమైన జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. నానావతికి కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ, ఆయనపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం, సానుభూతి కారణంగా ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ విజయలక్ష్మి పండిట్ ఆయన శిక్షను తగ్గించారు. ఈ ప్రసిద్ధ కేసు బాలీవుడ్‌ను కూడా ఎంతగానో ఆకర్షించింది. ఈ కేసు ఆధారంగా గత 50 ఏళ్లలో, ముగ్గురు వేర్వేరు దర్శకులు ఇదే కేసుపై గొప్ప చిత్రాలను రూపొందించారు.

3 / 5
నానావతి ఉదంతం ఇంకా తాజాగానే ఉండగా, 1963లో దర్శకుడు ఆర్. కె. నాయర్ ఆ సంఘటన ఆధారంగా 'యే రాస్తే హై ప్యార్ కే' అనే పేరుతో మొదటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నానావతి పాత్ర స్ఫూర్తితో ప్రముఖ నటుడు సునీల్ దత్ 'అనిల్ సాహ్ని' అనే ప్రధాన పాత్రను పోషించారు. ఆయనతో పాటు లీలా నాయుడు, అశోక్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

నానావతి ఉదంతం ఇంకా తాజాగానే ఉండగా, 1963లో దర్శకుడు ఆర్. కె. నాయర్ ఆ సంఘటన ఆధారంగా 'యే రాస్తే హై ప్యార్ కే' అనే పేరుతో మొదటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నానావతి పాత్ర స్ఫూర్తితో ప్రముఖ నటుడు సునీల్ దత్ 'అనిల్ సాహ్ని' అనే ప్రధాన పాత్రను పోషించారు. ఆయనతో పాటు లీలా నాయుడు, అశోక్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

4 / 5
పదేళ్ల తర్వాత, 1973లో, దిగ్గజ గీత రచయిత గుల్జార్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి నానావతి వ్యవహారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లారు. దేశంలోనే అగ్రశ్రేణి గీత రచయిత అయినప్పటికీ, గుల్జార్ 'అచానక్' చిత్రంలో ఒక్క పాటను కూడా చేర్చకుండా చాలా సాహసోపేతమైన ప్రయోగం చేశారు. అదే కేసు 2016లో దర్శకుడు టిను సురేష్ దేశాయ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'రుస్తోమ్' తెరకెక్కించారు. నటుడు అక్షయ్ కుమార్ నావికాదళ అధికారి రుస్తోమ్ పావ్రి పాత్రకు ఎంతగా జీవం పోశారంటే, ఈ నటనకు గాను ఆయన 'ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం' గెలుచుకున్నారు.

పదేళ్ల తర్వాత, 1973లో, దిగ్గజ గీత రచయిత గుల్జార్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి నానావతి వ్యవహారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లారు. దేశంలోనే అగ్రశ్రేణి గీత రచయిత అయినప్పటికీ, గుల్జార్ 'అచానక్' చిత్రంలో ఒక్క పాటను కూడా చేర్చకుండా చాలా సాహసోపేతమైన ప్రయోగం చేశారు. అదే కేసు 2016లో దర్శకుడు టిను సురేష్ దేశాయ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'రుస్తోమ్' తెరకెక్కించారు. నటుడు అక్షయ్ కుమార్ నావికాదళ అధికారి రుస్తోమ్ పావ్రి పాత్రకు ఎంతగా జీవం పోశారంటే, ఈ నటనకు గాను ఆయన 'ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం' గెలుచుకున్నారు.

5 / 5
Follow Us