Jr. NTR: యంగ్ టైగర్ అజ్ఞాతవాసం.. వేదికపై తారక్ కామెంట్ ఆ హింటేనా.?
ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కోసం అజ్ఞాతవాసం చేయబోతున్నారా.,.? ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇప్పటికే స్లిమ్ లుక్లోకి మారిపోయిన తారక్ మరికొద్ది రోజులు కెమెరాలకు దూరంగా ఉంటారా..? అర్జున్ సన్నాఫ్ వైజయంతి వేదిక మీద తారక్ చేసిన కామెంట్ ఆ హింటేనా..? ఈ స్టోరీలో డిటైల్డ్గా చూద్దాం.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 15, 2025 | 4:32 PM

'మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలియదు ఒకసారి మాట్లాడనివ్వండి తనివి తీరా' అంటూ ఎన్టీఆర్ స్పీచ్ మొదలు పెట్టడంతో అభిమానులు షాక్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ రెండు ఈవెంట్స్లో సందడి చేసిన ఎన్టీఆర్, సడన్గా ఇలాంటి కామెంట్ చేయటంతో ఇక మీద కెమెరాలకు పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండబోతున్నారా అన్నచర్చ మొదలైంది.

ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇప్పటికే స్లిమ్ లుక్లోకి మారిపోయారు జూనియర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే కీ సీన్స్ కోసం ఈ లుక్ను ప్లాన్ చేశారు. అయితే వెయిట్ తగ్గినా.. ఇదే ఫైనల్ లుక్ కాదని, హెయిర్ స్టయిల్ను కూడా డిఫరెంట్గా ప్లాన్ చేశారన్నది లేటెస్ట్ అప్డేట్.

ఆ లుక్ను సిల్వర్ స్క్రీన్ మీదే చూసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ను సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే కొద్ది రోజులు అజ్ఞాతవాసంలో ఉండబోతున్నారు జూనియర్.

ఏప్రిల్ 22 నుంచి తారక్ షూట్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ షెడ్యూల్లోనే ఈ సీన్స్ను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఆ తరువాత మళ్లీ నార్మల్ లుక్లోకి వచ్చేస్తారు. అప్పుడే వార్ 2 ప్రమోషన్స్ లో పాల్గొనేలా పక్కగా డేట్స్ ప్లాన్ చేశారు జూనియర్.

వార్ 2 వర్క్ కూడా ఫైనల్ స్టేజ్కు వచ్చేసింది. ఈ నెల 2 లోగా లాస్ట్ సాంగ్ షూటింగ్ను పూర్తి చేసి, తరువాత పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా మీద ఫోకస్ చేసేలా డేట్స్ ప్లాన్ చేశారు ఎన్టీఆర్. తారక్ కోసం తన రెగ్యులర్ స్టైల్ను పక్కన పెట్టి డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్.





























