- Telugu News Photo Gallery Cinema photos Japan to Maa Oori Polimera 2 latest movie updates from film industry
Movie Updates: జపాన్ చిత్రం నుంచి సాంగ్ రిలీజ్.. ‘మా ఊరి పొలిమేర 2’ ట్రైలర్ విడుదల..
ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా మాల్ లాంఛ్లో ఇండియన్ సినీ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యారు. టాలీవుడ్ దంపతులు మనోజ్, భూమా మౌనిక ఈ వేడుకలో పాల్గొన్నారు. కార్తి హీరోగా రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న సినిమా జపాన్. దివాళికి విడుదల కానుంది ఈ చిత్రం. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోని రియల్ ఇన్సిడెంట్స్తో పా రంజిత్ తెరకెక్కిస్తున్న సినిమా తంగలాన్. ప్రముఖ నటుడు, బిగ్ బాస్ ఏడో సీజన్ పెద్దన్న శివాజీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘మా ఊరి పొలిమేర 2’ చిత్ర రిలీజ్ ట్రైలర్ విడుదలైంది.
Updated on: Nov 02, 2023 | 3:21 PM

ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా మాల్ లాంఛ్లో ఇండియన్ సినీ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యారు. అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రతీ ఒక్కరూ దీనికి వచ్చారు. కాగా టాలీవుడ్ నుంచి మంచు మనోజ్ దంపతులు కూడా ఈ వేడుకలో భాగం అయ్యారు. మనోజ్, భూమా మౌనిక దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కార్తి హీరోగా రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న సినిమా జపాన్. దివాళికి విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో కార్తి దొంగగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా నుంచి చక్రాల్లాంటి కళ్ళతో అంటూ సాగే సింగిల్ రిలీజ్ చేసారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫామ్లో ఉన్నారు కార్తి. దాంతో జపాన్పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. సునీల్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోని రియల్ ఇన్సిడెంట్స్తో పా రంజిత్ తెరకెక్కిస్తున్న సినిమా తంగలాన్. తాజాగా దీని టీజర్ విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 'తంగలాన్' వస్తుంది. మేకింగ్లోనే విక్రమ్ గెటప్ చూసి అంతా షాకయ్యారు. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్లో స్పెషల్ ఈవెంట్య ప్లాన్ చేసారు మేకర్స్.

ప్రముఖ నటుడు, బిగ్ బాస్ ఏడో సీజన్ పెద్దన్న శివాజీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. 90స్ పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్ సిరీస్లో శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. 'తొలి ప్రేమ' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ సతీమణిగా నటిస్తున్నారు. తాజాగా నైంటీస్ టీజర్ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.

రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం అందుకున్న ‘మా ఊరి పొలిమేర’. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసారు దర్శక నిర్మాతలు. కమెడియన్గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా మారారు. నవంబర్ 3న పొలిమేర 2 విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ విడుదలైంది.




