AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోని చూసి రౌడీలా ఉన్నాడు అనుకున్నా.. ఆ విషయం అతనికి తెలిసి..

నటి సుహాసిని మణిరత్నం మెగాస్టార్ చిరంజీవితో తన ప్రస్థానాన్ని, వ్యక్తిగత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవిని తొలిసారి కెమెరా అసిస్టెంట్‌గా కాళీ అనే తమిళ్-తెలుగు చిత్రంలో చూసినప్పుడు, ఆయన తెలుగు పెద్దగా రాని వ్యక్తిగా, సెట్‌లో ఒక మూలలో కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నారని తెలిపారు.

Rajeev Rayala
|

Updated on: May 14, 2026 | 1:41 PM

Share
Sనటి సుహాసిని మణిరత్నం మెగాస్టార్ చిరంజీవితో తన ప్రస్థానాన్ని, వ్యక్తిగత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవిని తొలిసారి కెమెరా అసిస్టెంట్‌గా కాళీ అనే తమిళ్-తెలుగు చిత్రంలో చూసినప్పుడు, ఆయన తెలుగు పెద్దగా రాని వ్యక్తిగా, సెట్‌లో ఒక మూలలో కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నారని సుహాసిని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆమెకు భవిష్యత్తులో తాను హీరోయిన్‌గా మారతాననే ఊహ కూడా లేదని తెలిపారు.

Sనటి సుహాసిని మణిరత్నం మెగాస్టార్ చిరంజీవితో తన ప్రస్థానాన్ని, వ్యక్తిగత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవిని తొలిసారి కెమెరా అసిస్టెంట్‌గా కాళీ అనే తమిళ్-తెలుగు చిత్రంలో చూసినప్పుడు, ఆయన తెలుగు పెద్దగా రాని వ్యక్తిగా, సెట్‌లో ఒక మూలలో కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నారని సుహాసిని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆమెకు భవిష్యత్తులో తాను హీరోయిన్‌గా మారతాననే ఊహ కూడా లేదని తెలిపారు.

1 / 5
ఆ తర్వాత సుహాసిని తెలుగులో నటించిన రెండవ చిత్రంలో చిరంజీవి సరసన నటించారు. ఈ చిత్రం తమిళ్‌లో పెద్ద హిట్ అయ్యిందని, అది ఒక ప్రయోగాత్మక, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని, ఐదుగురు నటులకు సమాన ప్రాధాన్యత ఉన్నప్పటికీ చిరంజీవి నటించారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో మొదట్లో వారికి మధ్య చిన్న గొడవ కూడా  జరిగిందని తెలిపారు, చిరంజీవి తనను "ఈ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువ" అని అనుకున్నారని తెలిపారు.

ఆ తర్వాత సుహాసిని తెలుగులో నటించిన రెండవ చిత్రంలో చిరంజీవి సరసన నటించారు. ఈ చిత్రం తమిళ్‌లో పెద్ద హిట్ అయ్యిందని, అది ఒక ప్రయోగాత్మక, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని, ఐదుగురు నటులకు సమాన ప్రాధాన్యత ఉన్నప్పటికీ చిరంజీవి నటించారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో మొదట్లో వారికి మధ్య చిన్న గొడవ కూడా  జరిగిందని తెలిపారు, చిరంజీవి తనను "ఈ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువ" అని అనుకున్నారని తెలిపారు.

2 / 5
మొదట్లో తాను రిఫ్లెక్టర్ వేసిన అమ్మాయి హీరోయిన్ అవ్వడం ఆయనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు సుహాసిని. చిరంజీవి హాస్యాన్ని వివరిస్తూ, ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఆమె పక్కన కూర్చుని నిద్రపోయి, లేచిన తర్వాత "నీకేమైనా కావాలంటే నన్ను అడగొద్దు, నేను ఏం చేయలేను, నువ్వే సాల్వ్ చేసుకోవాలి" అని చెప్పడం ఆయన సరదాకు నిదర్శనమని అన్నారు.

మొదట్లో తాను రిఫ్లెక్టర్ వేసిన అమ్మాయి హీరోయిన్ అవ్వడం ఆయనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు సుహాసిని. చిరంజీవి హాస్యాన్ని వివరిస్తూ, ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఆమె పక్కన కూర్చుని నిద్రపోయి, లేచిన తర్వాత "నీకేమైనా కావాలంటే నన్ను అడగొద్దు, నేను ఏం చేయలేను, నువ్వే సాల్వ్ చేసుకోవాలి" అని చెప్పడం ఆయన సరదాకు నిదర్శనమని అన్నారు.

3 / 5
అలాగే, ఒకసారి సుమలతతో కలిసి నటిస్తున్నప్పుడు, చిరంజీవిని "విలన్ లా ఉన్నాడే" అని సుహాసిని సరదాగా అనగా, ఆ విషయం చిరంజీవికి చేరడంతో, ఆయన మరుసటి రోజు సెట్‌లో " విలన్‌తో ఎవరు యాక్ట్ చేస్తారు?" అని అడిగి ఆటపట్టించారని సుహాసిని నవ్వుతూ వివరించారు. తర్వాత తన క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన సులభంగా మన్నించలేదని, కానీ చివరికి వారు మంచి స్నేహితులుగా మారారని చెప్పారు.

అలాగే, ఒకసారి సుమలతతో కలిసి నటిస్తున్నప్పుడు, చిరంజీవిని "విలన్ లా ఉన్నాడే" అని సుహాసిని సరదాగా అనగా, ఆ విషయం చిరంజీవికి చేరడంతో, ఆయన మరుసటి రోజు సెట్‌లో " విలన్‌తో ఎవరు యాక్ట్ చేస్తారు?" అని అడిగి ఆటపట్టించారని సుహాసిని నవ్వుతూ వివరించారు. తర్వాత తన క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన సులభంగా మన్నించలేదని, కానీ చివరికి వారు మంచి స్నేహితులుగా మారారని చెప్పారు.

4 / 5
కాగా ప్రస్తుతం సుహాసిని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తున్నారు. సుహాసిని మణిరత్నంను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుహాసిని- మణిరత్నంలది ప్రేమ వివాహం. వీరి వివాహం 1988లో జరిగింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేశారు సుహాసిని. అలాగే మణిరత్నం కూడా పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు.

కాగా ప్రస్తుతం సుహాసిని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తున్నారు. సుహాసిని మణిరత్నంను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుహాసిని- మణిరత్నంలది ప్రేమ వివాహం. వీరి వివాహం 1988లో జరిగింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేశారు సుహాసిని. అలాగే మణిరత్నం కూడా పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు.

5 / 5
Follow Us