Drinking Water for Weight lose: నీళ్లు తాగినా బరువు తగ్గొచ్చు.. అయితే ఓ కండీషన్! అదేంటంటే..
బరువు పెరగడానికి అనేక మార్గాలు ఉన్నాయి. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో అనేక మార్పుల కారణంగా సాధారణంగా బరువు పెరుగుతారు. ప్రపంచంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారని నివేదికలు వెల్లడించాయి. ఆరోగ్యాంగా ఉండాలంటే బరువు అదుపులో ఉంచుకోవడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారం తినడం నుంచి మంచి జీవనశైలిని అనుసరించడం వరకు ఎన్నో మంచి దినచర్యను అలవర్చుకోవాలి. బరువు తగ్గడానికి సులభమైన మార్గం ఏమిటి? మీలో ఎవరైనా ఆలోచిస్తుంటే మాత్రం.. అలాంటి వారి కోసం చక్కటి చిట్కా..

సాధారణంగా బరువు తగ్గడం విషయానికి వస్తే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అయినా కొంతమందికి బరువు తగ్గడం అంత సులభం కాదు. కానీ కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లను మార్చుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభం అవుతుంది. అదేంటంటే.. బరువు తగ్గడంలో నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుందని హార్వర్డ్ అధ్యయనం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. శరీర బరువును తగ్గించడానికి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి పుష్కలంగా నీరు త్రాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సరైన మొత్తంలో నీరు త్రాగడం జీర్ణక్రియకు, మొత్తం పేగుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మీరు ఎలాంటి నీళ్లు తాగాలి?
బరువు తగ్గడానికి నీరు సరైన ఉష్ణోగ్రతలో ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు చల్లటి నీరు తాగడం చాలా ప్రయోజనకరమని నిపుణులు అంటున్నారు. నిజానికి, మన శరీరం చల్లని నీటిని సాధారణ శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శక్తిని ఉపయోగిస్తుంది. దీనివల్ల అదనపు కేలరీలు ఖర్చవుతాయి. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఈ రెండు అంశాలు కలిసి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఏ సమయంలో నీళ్లు తాగాలి?
నీళ్లు తాగడానికి సరైన సమయం లేదని నిపుణులు అంటున్నారు. దాహం వేసినప్పుడల్లా నీరు తాగవచ్చు. రోజు మొత్తంలో పుష్కలంగా నీరు త్రాగాలి. బరువు తగ్గడానికి భోజనానికి అరగంట ముందు నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీరు తినే ఆహారం శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ఏదైనా తినే ముందు ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం మంచిది.
ఎంత నీరు తాగాలి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి ఒక్కరూ ఇంత నీరు త్రాగాలని చెప్పే నియమం ఏమీలేదు. దాహం వేసినప్పుడల్లా నీళ్లు తాగవచ్చు. శరీరం ఎప్పుడు నీరు అవసరమో అప్పుడు చెబుతుంది. అప్పుడు వెంటనే నీరు త్రాగటం మంచిది. చాలా సార్లు ఆకలి, దాహం కారణంగా మానసికంగా గందరగోళానికి గురవుతారు. ఈ పరిస్థితిని నివారించడానికి, ఏదైనా తినడానికి ముందు అర గ్లాసు నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా, ఏదైనా తినాలని అనిపిస్తేనే తినడం మంచిది. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాలని గుర్తుంచుకోవాలి.
నీటితో పాటు అల్లం, మెంతులు, దోసకాయ, కరివేపాకు, పుదీనా, నిమ్మకాయ, ఆమ్లా, జీలకర్ర వంటి ఆహారాలు త్వరగా బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రకమైన ఆహారాలను నీటితో కలిపి తాగడం వల్ల అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








