- Telugu News Photo Gallery Business photos PM Kisan samman nidhi 20th installment latest update know eligibility and how to do kyc and check status
PM Kisan Scheme: పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?
PM Kisan: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి.ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున కేంద్రం అందిస్తోంది. అయితే ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది..
Updated on: Apr 03, 2025 | 4:16 PM

భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అలాగే రైతులకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మోడీ సర్కార్.. వాటిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ పథకం ప్రయోజనాలను రైతులకు అందుతాయి.

మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే, ఈ పథకం కింద అందుకున్న వాయిదాల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు 19వ విడత డబ్బులు అందుకున్న రైతులు.. ఇప్పుడు 20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ పథకం నిధులు ప్రతి నాలుగు నెలలకోసారి విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి రూ.6000 చొప్పున మూడు వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో విడుదల చేస్తుంది.

అయితే ఇటీవల 19వ విడత డబ్బులు విడుదల కాగా, 20వ విడత డబ్బులు విడుదల కావడానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. జూన్ నెలలో విడుదల కావచ్చని తెలుస్తోంది.

అయితే పీఎం కిసాన్ స్కీమ్ పథకం ప్రయోజనం పొందే రైతులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ లేనివారికి డబ్బులు అందవని గుర్తించుకోండి. పూర్తి కేవైసీ లేని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేస్తుంది. అందుకే కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఇందు కోసం మీ దగ్గరలోని మీ సేవ కేంద్రం, లేదా ఏదైనా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి కూడా కేవైసీ చేసుకోవచ్చు.





























