AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: చ‌నిపోయాడ‌ని పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే.. 24 గంట‌ల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు..

ఓ 55 ఏళ్ళ వ్యక్తి చ‌నిపోయాడ‌ని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ 24 గంట‌ల్లోనే ఆ వ్య‌క్తి ఇంటికి తిరిగొచ్చాడు. ఇది విన‌డానికి విచిత్రంగానే ఉన్న‌ప్ప‌టికీ..

Tamilnadu: చ‌నిపోయాడ‌ని పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే.. 24 గంట‌ల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు..
Death Mystery
Ravi Kiran
|

Updated on: Apr 06, 2022 | 7:12 PM

Share

ఓ 55 ఏళ్ళ వ్యక్తి చ‌నిపోయాడ‌ని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ 24 గంట‌ల్లోనే ఆ వ్య‌క్తి ఇంటికి తిరిగొచ్చాడు. ఇది విన‌డానికి విచిత్రంగానే ఉన్న‌ప్ప‌టికీ.. నిజంగానే జ‌రిగింది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని ఈరోడ్‌కు స‌మీపంలోని బ‌న‌గ‌ల‌ద్‌పూర్ వ‌ద్ద చోటు చేసుకుంది. మూర్తి అనే దిన‌స‌రి కూలీ చెరుకు తోటల్లో ప‌ని చేసేందుకు కొద్ది రోజుల క్రితం తిర్పూర్ వెళ్లారు. అయితే ఆదివారం ఉద‌యం మూర్తి చ‌నిపోయిన‌ట్లు అత‌ని కుమారుడు కార్తీకి స‌మాచారం అందింది. దీంతో కార్తీ అక్కడికి వెళ్లి చూడ‌గా, చ‌నిపోయింది త‌న తండ్రేన‌ని నిర్ధారించుకున్నాడు. ఇక డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చి ఆదివారం రాత్రి పూడ్చిపెట్టారు. అనంత‌రం అంద‌రూ ఇంటికి తిరిగొచ్చారు. అయితే సోమ‌వారం సాయంత్రం మూర్తి స‌జీవంగా ఇంటికి తిరిగొచ్చాడు. మూర్తిని చూసి కుటుంబ స‌భ్యులు షాక్‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read: 

Viral: ఓర్నీ క్రియేటివిటీ తగలయ్యా.! ఇలా కూడా కాపీ చేస్తారా.? ఖంగుతిన్న అధికారులు..

Telangana: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. తీరా చూస్తే.. జాలరికి ఊహించని షాక్!