భర్త ముందే దారుణం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతుండగా..

ఒక ద్విచక్రవాహనం మరో బైక్ ను ఢీకొట్టింది.. దీంతో దీనిపై ఇద్దరు బైకర్ల వాగ్వాదం మొదలైంది.. అది కాస్త చూస్తుండానే చినికిచినికి గాలి వానలా మారి చంపుకునే స్థాయికి చేరుకుంది.. నిందితుడు మహిళపై కాల్పులు జరపగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది.. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

భర్త ముందే దారుణం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతుండగా..
Crime News
Follow us

|

Updated on: Aug 01, 2024 | 10:54 AM

ఒక ద్విచక్రవాహనం మరో బైక్ ను ఢీకొట్టింది.. దీంతో దీనిపై ఇద్దరు బైకర్ల వాగ్వాదం మొదలైంది.. అది కాస్త చూస్తుండానే చినికిచినికి గాలి వానలా మారి చంపుకునే స్థాయికి చేరుకుంది.. నిందితుడు మహిళపై కాల్పులు జరపగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది.. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.. ఈశాన్య ఢిల్లీలోని గోకల్‌పురిలో బుధవారం ఒక వ్యక్తి.. నలుగురు సభ్యుల కుటుంబంపై కాల్పులు జరపగా.. 30 ఏళ్ల మహిళ మరణించింది.. తమ వాహనాలు ఒకదానికొకటి స్వల్పంగా కొట్టుకోవడంతో ఇద్దరు బైక్ డ్రైవర్ల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం.. చంపుకునే వరకు వెళ్లినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం.. నిందితుడు బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై వెళుతున్న కుటుంబంపై ఒక రౌండ్ కాల్పులు జరపగా.. బుల్లెట్ మహిళకు తాకిందని పోలీసులు తెలిపారు.

వజీరాబాద్ రోడ్డులోని గోకల్‌పురి ఫ్లైఓవర్ సమీపంలో మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హీరా సింగ్ (40) తన భార్య సిమ్రంజీత్ కౌర్ (30), 2, 12 సంవత్సరాల ఇద్దరు కుమారులతో కలిసి తన మోటార్‌సైకిల్‌పై వెళుతున్నాడు.. ఈ క్రమంలో ఫ్లైఓవర్ సమీపంలో వారి బైక్ ను మరొక ద్విచక్ర వాహన దారుడు వారి బైక్ ను ఢీకొట్టాడు.. అనంతరం ఇద్దరు బైకర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఇరువురు పరస్పరం దూషించుకున్నారు. నిందితుడు స్కూటర్ రైడర్ ఫ్లైఓవర్‌పైకి వెళ్లగా, సింగ్ ఫ్లైఓవర్ పక్కనే రోడ్డుపై మౌజ్‌పూర్ వైపు వెళ్లడం వరకు వాగ్వాదం కొనసాగింది. అనంతరం నిందితుడు తమపై 35 అడుగుల దూరంలో ఉన్న ఫ్లైఓవర్ నుంచి ఒక్కసారిగా కాల్పులు జరిపాడని సింగ్ పోలీసులకు తెలిపారు.

బుల్లెట్ నేరుగా అతని భార్య మెడకు తగిలిందని, ఆమె తీవ్రంగా గాయపడిందని.. తరువాత ఆమెను సమీపంలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు.

కాల్పుల జరిపిన అనంతరం నిందితుడు బైకర్ అక్కడి నుంచి పారిపోగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి హత్య కేసు నమోదు చేశామని.. క్రైమ్ స్పాట్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దారుణం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతుండగా..
దారుణం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతుండగా..
13 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..
13 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..
ఉత్తరేణితో ఈ నివారణలతో అదృష్టం మీ సొంతం..
ఉత్తరేణితో ఈ నివారణలతో అదృష్టం మీ సొంతం..
మృణాలా మజాకా.. ఈ అమ్మడి పీట్లు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే
మృణాలా మజాకా.. ఈ అమ్మడి పీట్లు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే
తెలంగాణ అసెంబ్లీలో దుమ్ముదుమారం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీలో దుమ్ముదుమారం.. లైవ్ వీడియో
ఈ ఫొటోలో పుల్లలు ఏరుకుంటున్న అమ్మాయి.. ఎవరో తెలుసా.?
ఈ ఫొటోలో పుల్లలు ఏరుకుంటున్న అమ్మాయి.. ఎవరో తెలుసా.?
వ్యక్తి మద్యానికి ఎందుకు బానిసగా మారుతాడు.? ఇందులోనూ సైన్స్ ఉంది.
వ్యక్తి మద్యానికి ఎందుకు బానిసగా మారుతాడు.? ఇందులోనూ సైన్స్ ఉంది.
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఎంతో తెలుసా
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఎంతో తెలుసా
చెవుల ఆకారం బట్టి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారో తెలుసుకోవచ్చు..
చెవుల ఆకారం బట్టి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారో తెలుసుకోవచ్చు..
ఎలక్ట్రిక్‌ మసాజర్లతో నష్టాలు ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఎలక్ట్రిక్‌ మసాజర్లతో నష్టాలు ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..