Ration Card : లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఆ లిస్ట్లో పేరు లేకుంటే రేషన్ కార్డు రద్దే!
ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేసి, అత్యంత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సర్వే తర్వాత వచ్చిన ఓటర్ లిప్ట్లో పేరులేని వ్యక్తుల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

బోగస్ ఓట్లను తొలగించి.. ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియను చేపట్టిన విషయం అందిరికి తెలిసిందే.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ముగియగా.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్దమైంది. అయితే ఇప్పటికే SIR ప్రక్రియ పూర్తైన బెంగాల్లో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా ఉండి లబ్దిపొంతున్న, అక్రమంగా దేశంలో నివపిస్తున్న వారి రేషన్ కార్డులను వెంటనే రద్దు చేయాలని నిర్ణయింది. ఈ మేరకు పౌరసరఫరా శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది.
దీంతో SIR ప్రక్రియ తర్వాత 2026లో విడుదలైన ఓటర్ లిస్ట్లో పేర్లు లేని లబ్ధిదారులను గుర్తించి వారి రేషన్ కార్డులను తొలగించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. జూన్ 15 లోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను రద్దు చేయాలని అన్ని జిల్లాల కలెక్టరేట్లకు అదేశాలు కూడా పంపింది. అయితే చాలా రోజులుగా ఆహార పంపిణీ వ్యవస్థలో ఉన్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో అందుబాటులో లేనివారు, నివాసం మారినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లను గుర్తించి వాళ్ల ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ముఖ్యంగా ఐదు కేటగిరీల ద్వారా ఈసీ అనర్హులను గుర్తించి వార్డు కార్డులను రద్దు చేస్తోంది. మొదటిగా 2015 డిసెంబర్ 16 నాటి డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు లేని వ్యక్తులు, ఫామ్-6 ద్వారా మళ్లీ జాబితో పేరు చేర్చుకొని వారి రేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేస్తోంది. అలాగే మ్యాపింగ్ చేయకుండా ఉన్నవారి కార్డులు, డ్రాఫ్ట్ లిస్ట్ సెకండ్ ఫేజ్లో పేర్లు నమోదు చేసుకోని వారి కార్డులను తొలగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
