AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: ఈవీఎం రచ్చ.. మూడు గంటల పాటు స్ట్రాంగ్‌రూమ్‌లోనే గడిపిన మమతా..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించి, ఈవీఎంల భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌లో మూడు గంటలకు పైగా గడిపిన అనంతరం తీవ్రంగా హెచ్చరించారు. ఓటింగ్ యంత్రాలను లేదా లెక్కింపు ప్రక్రియను తారుమారు చేయడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా చివరిదాకా ఎదుర్కొంటామని ఆమె అన్నారు.

West Bengal: ఈవీఎం రచ్చ.. మూడు గంటల పాటు స్ట్రాంగ్‌రూమ్‌లోనే గడిపిన మమతా..!
Cm Mamata Banerjee Visit Strongroom
Balaraju Goud
|

Updated on: May 01, 2026 | 11:02 AM

Share

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించి, ఈవీఎంల భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌లో మూడు గంటలకు పైగా గడిపిన అనంతరం తీవ్రంగా హెచ్చరించారు. ఓటింగ్ యంత్రాలను లేదా లెక్కింపు ప్రక్రియను తారుమారు చేయడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా చివరిదాకా ఎదుర్కొంటామని ఆమె అన్నారు. మే 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందు, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆమె రాజకీయ దుమారం రేపారు.

దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో మమతా బెనర్జీ సుమారు మూడు గంటలకు పైగా గడిపారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలను ఇక్కడ భద్రపరిచారు. సీసీటీవీ ఫుటేజీలో కొన్ని అనుమానాస్పద దృశ్యాలను చూసిన తర్వాతే తాను స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. మొదట అధికారులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ, అభ్యర్థిగా తనకున్న హక్కులను గుర్తుచేసి ఆమె లోపలికి వెళ్లారు. “ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు,” అని ఆమె మండిపడ్డారు.

స్ట్రాంగ్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈవీఎంలను దొంగిలించడానికి లేదా లెక్కింపులో తారుమారు చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని, అవసరమైతే ప్రాణాలొడ్డి పోరాడతామని స్పష్టం చేశారు. చాలా చోట్ల ఈవీఎంల నిర్వహణలో లోపాలు ఉన్నాయని, టీవీల్లో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తమ పార్టీ ప్రతినిధిని అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల యంత్రాంగం పక్షపాతంగా వ్యవహరిస్తోందని మమతా ఆరోపించారు.

మరోవైపు, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఒక వీడియోను విడుదల చేస్తూ బీజేపీ, ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించింది. సంబంధిత ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్ పెట్టెలను తెరుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోందని, ఇది నిబంధనల ఉల్లంఘన అని టీఎంసీ ఆరోపించింది. ఈ వీడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ప్రజా తీర్పును గౌరవించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల వేళ బెంగాల్ రాజకీయాలు ఈ పరిణామాలతో మరింత వేడెక్కాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us