AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Tradition: గబ్బిలాలను పూజించే వింత గ్రామం..! అదృష్ట దేవతలుగా కొలుస్తున్న గ్రామస్తులు..

గ్రామస్తులు ఈ గబ్బిలాలకు పూజలు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యం లేకుండా ఏ శుభకార్యమూ పూర్తి కాదు. అయితే, దీని వెనుక ఒక కథ ప్రచారం ఉంది.. అదేంటంటే.. మధ్యయుగంలో వైశాలి ఒక పెద్ద అంటువ్యాధి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగానే ఈ గ్రామానికి మొదట గబ్బిలాలు వచ్చాయని, అప్పటి నుంచి గ్రామం ఎలాంటి మహమ్మారి ప్రవేశించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Unique Tradition: గబ్బిలాలను పూజించే వింత గ్రామం..! అదృష్ట దేవతలుగా కొలుస్తున్న గ్రామస్తులు..
Bats
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2024 | 8:54 AM

Share

చెట్లకు తలకిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను మీరు చూసే ఉంటారు. ఈ గబ్బిలాలకు పూజలు చేస్తారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, మన భారతదేశంలో ఒక ప్రత్యేక గ్రామం ఉంది. ఇక్కడ ప్రజలు గబ్బిలాలను పూజించడమే కాకుండా వాటికి ఎలాంటి హాని కలుగకుండా రక్షిస్తారు. గబ్బిలాలను పూజించే వింత గ్రామం బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఉంది.. జిల్లాలోని సర్సాయి గ్రామంలో ప్రజలు గబ్బిలాలను పూజిస్తారు. గబ్బిలాలు నివసించే చోట డబ్బుకు లోటు ఉండదని సర్సారి గ్రామ ప్రజలు నమ్ముతారు. అయితే ఈ సర్సాయి గ్రామానికి గబ్బిలాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ తెలియని విషయం. అయితే, ఈ గబ్బిలాలను చూసేందుకు నిత్యం పర్యాటకుల రద్దీ ఉంటుంది. ప్రజలు ఈ గబ్బిలాలను సంపద, అదృష్టానికి దేవత అయిన లక్ష్మిదేవితో పోలుస్తారు. ఈ గబ్బిలాలు సర్సాయి గ్రామం మధ్యలో ఉన్న పురాతన సరస్సు సమీపంలోని అరలి చెట్టుతో సహా వివిధ చెట్లలో నివసిస్తాయి. ఈ సరస్సును 1402(BC)లో అప్పటి స్థానిక రాజు నిర్మించాడని చెబుతారు. ఈ సరస్సుకు ఆనుకుని ఉన్న 50 ఎకరాల విస్తీర్ణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరి బయటి నుంచి ఎవరైనా రాత్రి పూట సరస్సు దగ్గరకు వెళితే గబ్బిలాలు రెచ్చిపోతుంటాయి. కానీ వాటి వల్ల గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. ఇక్కడ గబ్బిలాలు లేకుండా ఏ మతపరమైన వేడుక పూర్తికాదు. ఇది ఇక్కడి గబ్బిలాలకు నివాళి లాంటిది. గ్రామస్తులు ఈ గబ్బిలాలకు పూజలు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ గబ్బిలాలకు సాంప్రదాయ నైవేద్యం లేకుండా ఏ శుభకార్యమూ పూర్తి కాదు. అయితే, దీని వెనుక ఒక కథ ప్రచారం ఉంది.. అదేంటంటే.. మధ్యయుగంలో వైశాలి ఒక పెద్ద అంటువ్యాధి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగానే ఈ గ్రామానికి మొదట గబ్బిలాలు వచ్చాయని, అప్పటి నుంచి గ్రామం ఎలాంటి మహమ్మారి ప్రవేశించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ గబ్బిలాలు నిర్దిష్ట వాసనను వెదజల్లుతాయని, ఇవి మానవ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే బ్యాక్టీరియాను చంపే రసాయనాలను కలిగి ఉన్నాయని గ్రామస్థులు చెప్పిన కథ ఆధారంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ గబ్బిలాలను చూసేందుకు గ్రామానికి వచ్చే పర్యాటకులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోని పాలకమండలి తీరుతో గ్రామ ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఇక్కడ వేలాది గబ్బిలాలు ఉన్నాయి. వాటిని చూడటానికి మిలియన్ల మంది పర్యాటకులు ఏడాది పొడవునా ఈ గ్రామానికి వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..