AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti-Ship Missile: ఎప్పుడైనా.. ఎక్కడైనా మేం సిద్ధం.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ను పరీక్షించిన ఇండియన్‌ నేవీ!

హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారత్‌ నౌకాదళం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా అరేబియా సముద్రంలో యాంటీ-షిప్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

Anti-Ship Missile: ఎప్పుడైనా.. ఎక్కడైనా మేం సిద్ధం.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ను పరీక్షించిన ఇండియన్‌ నేవీ!
Anti Ship Missile
Anand T
|

Updated on: Apr 27, 2025 | 3:27 PM

Share

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్యాక్‌ వ్యతిరేకంగా భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత దళాలను రెచ్చగొట్టే విధంగా పాక్‌ ప్రయత్నాలను సాగిస్తోంది. దీంతో సరిహద్దుల్లో సైనికులు అలర్ట్ అయ్యాయి. అయితే దాయాదీ దేశం ఏలాంటి ఎత్తులతో వచ్చినా ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత్ త్రివిద దళాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యాంటీ-షిప్ మిసైల్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల నుంచి సుదీర్ఘ దూరాన లక్ష్యాలను ఖచ్చితంగా చేధించిది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేవీ స్పష్టం చేసింది. అరేబియా సముద్రం మధ్యలో యుద్ధనౌకల నుంచి చేపట్టిన బ్రహ్మోస్ యాంటీ-షిప్, యాంటీ-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన దృశ్యాలను ఇండియన్‌ నేవీ సోషల్‌ మీడియా వేదికగా  పంచుకుంది.

పాకిస్థాన్‌ చేసే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధమవుతున్నట్టు చూపించేందుకు భారత్‌ ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. సముద్రజలాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ఇండియన్‌ నేవీ తెలిపింది . ఇదే కాకుండా ఇండియన్ నేవీ ఇటీవలే 70 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌(MR-SAM)ను పరీక్షించింది. ఈ సందర్భంగా గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ అయిన ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!
బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!
లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!