AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..! ఇక తీర్పులు..

కరోనా ఎఫెక్ట్‌ సుప్రీంకోర్టుపై కూడా ప్రభావం చూపుతోంది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను నివారించేందుకు గాను.. త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ జరుగుతుందని సుప్రీం జ‌డ్జి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సోమవారం నాడు పేర్కొన్నారు. కోర్టు పరిధిలో.. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించనున్నట్లు […]

కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..! ఇక తీర్పులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 16, 2020 | 6:30 PM

Share

కరోనా ఎఫెక్ట్‌ సుప్రీంకోర్టుపై కూడా ప్రభావం చూపుతోంది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను నివారించేందుకు గాను.. త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ జరుగుతుందని సుప్రీం జ‌డ్జి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సోమవారం నాడు పేర్కొన్నారు.

కోర్టు పరిధిలో.. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్ర‌య‌ల్ కోర్టుల్లో ప్రస్తుతం ప‌రిస్థితులు క్లిష్టంగా ఉన్నాయ‌ని, కేసుల విచారణ విషయమై అన్ని హైకోర్టుల‌తో చీఫ్ జ‌స్టిస్ ఎస్‌ఏ బాబ్డే సంప్రదిస్తున్నారన్నారు.

ఈ క్రమంలో వైర‌స్ వ్యాప్తికి అరికట్టేందుకు తొలి అడుగు వేశామ‌న్నారు. ఇక కేసుల‌న్నింటినీ డిజిట‌ల్ ఫైలింగ్ చేయ‌డం, వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించ‌డ‌మే తర్వాతి టార్గెట్ అని జస్టిస్ చంద్ర‌చూడ్ తెలిపారు. అంతేకాదు.. కోర్టుల్లో స్క్రీనింగ్ కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా..గత నెల ఫిబ్రవరి నుంచి మనదేశాన్ని కూడా వణికిస్తోంది. ఈ వైరస్‌బారిన పడి ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మరో 108 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ కేసులు మాత్రమే విచారిస్తామని శనివారమే సుప్రీం తెలిపింది. అంతేకాదు.. సోమవారం నుంచి 14 ధర్మాసనాల బదులుగా ఆరు ధర్మాసనాలు మాత్రమే పనిచేస్తున్నాయి. లాయర్లను కూడా పరిమితంగా అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. లిటిగెంట్లను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తుంది. ఈ మేరకు జిల్లా కోర్టులకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

Follow Us
కాకి అరుపు వినిపించిన దగ్గర ఈ ఒక్క పని చేయండి.. అవి మనకు..
కాకి అరుపు వినిపించిన దగ్గర ఈ ఒక్క పని చేయండి.. అవి మనకు..
ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం కొత్త కండీషన్
ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం కొత్త కండీషన్
స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
OTT Movie: 'రానా నాయుడు'కు మించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie: 'రానా నాయుడు'కు మించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి
హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి
దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభం అప్పుడే.. రైల్వేశాఖ డెసిషన్
దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభం అప్పుడే.. రైల్వేశాఖ డెసిషన్
వేసవిలో ఈ ఒక్క మొక్క పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!
వేసవిలో ఈ ఒక్క మొక్క పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!
టెస్టుల్లో టీమిండియాకు అసలు సిసలు పరీక్ష అక్కడే
టెస్టుల్లో టీమిండియాకు అసలు సిసలు పరీక్ష అక్కడే
పసుపు కల్తీని పట్టేయండిలా.. ఈ చిన్న టెస్ట్ తో మీ లివర్ సేఫ్!
పసుపు కల్తీని పట్టేయండిలా.. ఈ చిన్న టెస్ట్ తో మీ లివర్ సేఫ్!
మీ వంటింట్లోనే ఉన్నాయ్.. కిడ్నీలను రీఛార్జ్ చేసే సూపర్ ఫుడ్స్
మీ వంటింట్లోనే ఉన్నాయ్.. కిడ్నీలను రీఛార్జ్ చేసే సూపర్ ఫుడ్స్