AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..! ఇక తీర్పులు..

కరోనా ఎఫెక్ట్‌ సుప్రీంకోర్టుపై కూడా ప్రభావం చూపుతోంది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను నివారించేందుకు గాను.. త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ జరుగుతుందని సుప్రీం జ‌డ్జి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సోమవారం నాడు పేర్కొన్నారు. కోర్టు పరిధిలో.. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించనున్నట్లు […]

కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..! ఇక తీర్పులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 16, 2020 | 6:30 PM

Share

కరోనా ఎఫెక్ట్‌ సుప్రీంకోర్టుపై కూడా ప్రభావం చూపుతోంది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను నివారించేందుకు గాను.. త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ జరుగుతుందని సుప్రీం జ‌డ్జి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సోమవారం నాడు పేర్కొన్నారు.

కోర్టు పరిధిలో.. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్ర‌య‌ల్ కోర్టుల్లో ప్రస్తుతం ప‌రిస్థితులు క్లిష్టంగా ఉన్నాయ‌ని, కేసుల విచారణ విషయమై అన్ని హైకోర్టుల‌తో చీఫ్ జ‌స్టిస్ ఎస్‌ఏ బాబ్డే సంప్రదిస్తున్నారన్నారు.

ఈ క్రమంలో వైర‌స్ వ్యాప్తికి అరికట్టేందుకు తొలి అడుగు వేశామ‌న్నారు. ఇక కేసుల‌న్నింటినీ డిజిట‌ల్ ఫైలింగ్ చేయ‌డం, వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించ‌డ‌మే తర్వాతి టార్గెట్ అని జస్టిస్ చంద్ర‌చూడ్ తెలిపారు. అంతేకాదు.. కోర్టుల్లో స్క్రీనింగ్ కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా..గత నెల ఫిబ్రవరి నుంచి మనదేశాన్ని కూడా వణికిస్తోంది. ఈ వైరస్‌బారిన పడి ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మరో 108 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ కేసులు మాత్రమే విచారిస్తామని శనివారమే సుప్రీం తెలిపింది. అంతేకాదు.. సోమవారం నుంచి 14 ధర్మాసనాల బదులుగా ఆరు ధర్మాసనాలు మాత్రమే పనిచేస్తున్నాయి. లాయర్లను కూడా పరిమితంగా అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. లిటిగెంట్లను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తుంది. ఈ మేరకు జిల్లా కోర్టులకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు