మరోసారి గేదెను ఢీకొన్న వందేభారత్.. గేదె ఎగిరి మీద పడటంతో వ్యక్తి మృతి

మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడు శివదయాళ్ రైల్వేలో ఉద్యోగ విరమణ పొందాడు. గతంలో అతను ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేసేవాడు.

మరోసారి గేదెను ఢీకొన్న వందేభారత్.. గేదె ఎగిరి మీద పడటంతో వ్యక్తి మృతి
Follow us

|

Updated on: Apr 20, 2023 | 7:09 AM

మరోసారి వందేభారత్ అవాంఛనీయ కారణాలతో వార్తల్లోకి ఎక్కింది. రాజస్తాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గేదెను ఢీకొట్టింది. రాజస్తాన్‌లోని అజ్మేర్ నుంచి ఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. ఢిల్లీ నుంచి అజ్మేర్‌కు వస్తుండగా బుధవారం రోజు దుర్ఘటన జరిగింది. అల్వార్ జిల్లాలోని కాలిమోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రైలు గేదెను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కూడా మరణించాడు. వేగంగా దూసుకెళ్లుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. వందే భారత్ ట్రైన్ అధిక వేగంతో ఉండటంతో ఆ గేదె గాల్లోకి ఎగిరింది. అదే సమయంలో స్పాట్‌కు సమీపంలోనే ఉన్న ఒక వ్యక్తిపై ఆ గేదె పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి అయిన శివ దయాల్‌గా పోలీసులు గుర్తించారు.

శివ దయాల్ మృతదేహాన్ని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌ మార్చురీకి తరలించారు. ఈ ఘటన గురించి శివ దయాల్ కుటుంబానికి సమాచారం అందజేశారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడు శివదయాళ్ రైల్వేలో ఉద్యోగ విరమణ పొందాడు. గతంలో అతను ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేసేవాడు. మృతుడి కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఈ విషయమై రైల్వే అధికారులను సంప్రదిస్తామని మృతుల బంధువులు తెలిపారు.

కాగా, రాజస్తాన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Latest Articles