Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ఉత్తరఖాండ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన ప్రయాణికులతో ఉన్న బస్సు.. 15మందికి పైగా మృతి

ఉత్తరాఖండ్ అల్మోరాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు కాలువలో పడి, 15 మంది ప్రయాణికులు మృతి చెందారు. అల్మోరాలోని మార్చులా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కినాత్ నుంచి రాంనగర్ వెళ్తోండగా ఈ బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Uttarakhand: ఉత్తరఖాండ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన ప్రయాణికులతో ఉన్న బస్సు.. 15మందికి పైగా మృతి
Almor Road Accident
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2024 | 11:14 AM

ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తోన్న బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సంఘటనా స్థలానికి రప్పించామని ఓ అధికారి తెలిపారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీస్తున్నారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌ కూడా చేరుకుంది.

ఇవి కూడా చదవండి

ప్రమాదం ఎక్కడ జరిగిందంటే

అల్మోరాలోని మార్చుల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కినాత్ నుంచి రాంనగర్ కు వెళ్తోంది. ఈ బస్సులో నైనిదండాకు, కినాత్‌కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. యూజర్ల కంపెనీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైందని ఓ అధికారి తెలిపారు. సరద్ బ్యాండ్ సమీపంలో బస్సు నదిలో పడిపోయింది. మృతుల సంఖ్య 15కు పైగా ఉండొచ్చు.

ప్రమాదం జరిగిన ప్రదేశం కొండ ప్రాంతం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు కాలువలో పడిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. పక్కనే ఒక చిన్న నది ప్రవహిస్తోంది. ఘటనా స్థలంలో స్థానికులు నిలబడి ఉన్నారు.

ప్రమాదంపై విచారణ జరుపుతామన్న అధికారి

ఈ ప్రమాదంపై విచారణ జరుపుతామని ఓ అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేశాడా లేక వాహనంలో ఏదైనా సాంకేతిక సమస్య ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. బస్సు ఎంత స్పీడ్‌తో ప్రయాణిస్తోందన్న సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అల్మోరా జిల్లా ఆసుపత్రి, స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..