AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ రెండు నాల్కల ధోరణి.. కమల్ నాథ్ ఫైర్

తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. ఓ వైపు మా ఈ ఎమ్మెల్యేలను బందీలుగా నిర్బంధంలో ఉంచారు.

బీజేపీ రెండు నాల్కల ధోరణి.. కమల్ నాథ్ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 15, 2020 | 12:16 PM

Share

తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. ఓ వైపు మా ఈ ఎమ్మెల్యేలను బందీలుగా నిర్బంధంలో ఉంచారు.. మరోవైపు శాసన సభలో బల పరీక్ష జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. బెంగుళూరులో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ బందీలుగా చేసిందని, వారు విడుదలయ్యేలా చూడాలంటూ ఆయన హోం మంత్రి అమిత్ షాకు నాలుగు పేజీల లేఖ రాశారు. ఇందుకోసం మీ అధికారాన్ని ఉపయోగించండి అని కోరారు. వీరు విడుదలయితే ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్భయంగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన వీరంతా రాజీనామాలు చేయడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. వీరిని రిలీజ్ చేస్తే తమ ప్రభుత్వం వీరికి అత్యంత భద్రత కల్పిస్తుందని కమల్ నాథ్ అన్నారు. శాసన సభలో బల పరీక్ష జరిగేలా చూడాలని బీజేపీ ప్రతినిధిబృందమొకటి గవర్నర్ ను కలిసి అభ్యర్థించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాగా-సోమవారం సభలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని గవర్నర్ లాల్ జీ టాండన్ అసెంబ్లీ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయడంగానీ, జాప్యం చేయడం గానీ జరగరాదన్నారు. దీంతో ఇక కమల్ నాథ్ ప్రభుత్వ భవితవ్యం సోమవారం తేలనుంది.

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..