Dharmendra Pradhan: ఇక తెలుగులో కూడా సీబీఎస్‌ఈ సిలబస్‌.. సెంట్రల్‌ బోర్డు ప్రకటనపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశంసలు

ప్రాథమిక పాఠశాలల నుంచి పీయూసీ వరకు అన్ని పాఠశాలల్లో భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకోవడం..

Dharmendra Pradhan: ఇక తెలుగులో కూడా సీబీఎస్‌ఈ సిలబస్‌.. సెంట్రల్‌ బోర్డు ప్రకటనపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశంసలు
Dharmendra Pradhan

Updated on: Jul 21, 2023 | 10:42 PM

ప్రాథమిక పాఠశాలల నుంచి పీయూసీ వరకు అన్ని పాఠశాలల్లో భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమైనదని అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అలాగే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) లో ఊహించినట్లుగా ఇది పాఠశాలల్లో భారతీయ భాషా ఆధారిత విద్యను ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.

దీనిపై ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ, పాఠశాలల్లో మాతృభాష, భారతీయ భాషలలో విద్యను ప్రోత్సహించే దిశగా ఇది ప్రశంసనీయమైనదని అన్నారు. పాఠశాలలన్నింటిలో ప్రాథమిక నుంచి పన్నెండవ తరగతి వరకు భారతీయ భాషలలో విద్యను అందించే ఎంపికను అందించినందుకు సీబీఎస్‌ఈని నేను అభినందిస్తున్నాను. ఎన్‌ఈపీ ద్వారా ఊహించిన విధంగా ఇది పాఠశాలల్లో భారతీయ భాషా ఆధారిత విద్యను ప్రోత్సహిస్తుంది. విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది శుభారంభం’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రైమరీ నుంచి పన్నెండవ తరగతి వరకు భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించాలని సీబీఎస్‌ఈ బోర్డు అన్ని పాఠశాలలను ఆదేశించింది. పాఠశాలలు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని, బహుభాషా విద్యను ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి పరస్పరం సహకరించుకోవాలని బోర్డు ఆదేశించింది.

 


జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ), హయ్యర్ ఎడ్యుకేషన్‌లు బహుళ భాషలలో విద్యను ప్రవేశపెట్టడానికి ఎలా చర్యలు తీసుకున్నాయో వివరిస్తూ, సీబీఎస్‌ఈ ఇలా తెలియజేసింది. ‘భారతీయ భాషల ద్వారా విద్యను సులభతరం చేయడానికి తీసుకున్న పై కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు భారతీయ భాషలను ఉపయోగించడాన్ని పరిగణించవచ్చు. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో వివరించిన విధంగా భారతీయ భాషలను ప్రీ-ప్రైమరీ నుంచి పీయూసీ వరకు బోధనా మాధ్యమంగా ఉపయోగించవచ్చు. పాఠశాలలు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవచ్చు. ఈ రంగంలోని నిపుణులతో సంప్రదించవచ్చు. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో బహుభాషా విద్యను ప్రోత్సహించడానికి ఇతర పాఠశాలలతో సహకరించవచ్చు. ఉత్తమ అభ్యాసాలను పంచుకోవచ్చు’ అని బోర్డు పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి