Telangana: ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు.. పూర్తి వివరాలు

|

Dec 30, 2021 | 2:51 PM

Telanana:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం- తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో..

Telangana: ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు.. పూర్తి వివరాలు
Follow us on

Telangana: ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం- తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు పల రాష్ట్రాలపై ప్రశంసలు కురిపించింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం ప్రశంసలు కురిపించింది. 2020-21లో ఖరీఫ్‌లో దేశ వ్యాప్తంగా 894.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అయితే గత ఏడాదితో పోల్చితే 15 శాతం ధాన్యం సేకరణ పెరిగింది.

గతం కంటే ఎక్కువ ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ‌తో పాటు పంజాబ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 1.31 కోట్ల మంది రైతులకు కనీస మద్ధతు ధర ద్వారా రూ. 1,68,849 కోట్ల మేర లబ్దిపొందారు. 2021-22లో దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 472.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.

ఇవి కూడా చదవండి:

Telangana:  సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల బాదుడు !.. సీఎం కేసీఆర్‌ ఆమోదమే తరువాయి.. కిలోమీటరుకు ఎంత వరకు పెరగొచ్చంటే..

Mahabubabad: పత్తి బస్తాలను ఓపెన్‌ చేయగానే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..