AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cuddalore Accident: రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి.. కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాలు ఒకదానికొకటి వేగంగా ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కడలూరు తిరుచ్చి నేషనల్‌ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి.

Cuddalore Accident:  రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి.. కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Cuddalore Road Accident
Sanjay Kasula
|

Updated on: Jan 03, 2023 | 9:17 AM

Share

చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆగి ఉన్న కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు, ఒక పురుషుడు సహా ఐదుగురు మృతి చెందారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దక్షిణాది జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రాత్రిపూట కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. మృతులంతా చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. దక్షిణాది జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రాత్రిపూట కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ప్రైవేట్ ఓమ్నీ బస్సులు, ప్రభుత్వ బస్సులు, గూడ్స్ వాహనాలు, కార్లు రాత్రిపూట చెన్నై వైపు వరుసలో ఉంటాయి. ఈ నాలుగు లైన్ల రహదారిపై రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఈ రహదారిని విస్తరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఈ రహదారిపై ఎప్పటికప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇసుక లారీ ఢీకొంది

ఇలాంటి స్థితిలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో ట్రాఫిక్‌ రద్దీగా మారింది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన కారును వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

రెండు ట్రక్కుల మధ్య ఓ కారు 

ఎదురుగా నిలిచిన లారీని ఢీకొట్టిన కారు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి చిన్నగా నుజ్జునుజ్జయింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు నుజ్జునుజ్జు అయ్యారు. ప్రమాదాన్ని చూసిన తోటి వాహనదారులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

 2 గంటల పాటు శ్రమించి

దాదాపు 2 గంటల పాటు శ్రమించిన పోలీసులు కారులో ఉన్న ఐదుగురిని బయటకు తీయగలిగారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు, ఒక వ్యక్తితో సహా 5 మంది మృతదేహాలను బయటకు తీశారు. కారులో ఆర్‌సీ బుక్‌తో ప్రమాదానికి గురైన వ్యక్తులు కాంచీపురం జిల్లా నంగనల్లూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

ట్రాఫిక్ తెచ్చిన నష్టం

మదురైలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన రసీదు కూడా కారులో లభించడంతో పోలీసులు ఈ రశీదు ఆధారంగా ప్రమాద బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదం కారణంగా తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాద దృశ్యాలను ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!