జేఈఈ-నీట్ పరీక్షలు.. ఆరు రాష్ట్రాల మంత్రుల పిటిషన్ని కొట్టేసిన సుప్రీం
జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన
NEET-JEE Exams: జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షలు నిర్వహించడానికే అత్యున్నత న్యాయస్థానం మొగ్గుచూపింది. కాగా విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రవేశపరీక్షలను వాయిదా వేయడానికి తిరస్కరిస్తూ ఆగష్టు 17న సుప్రీం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా సమయంలో విద్యార్థుల ‘జీవించే హక్కు’ను కాపాడటం, పరీక్షకు హాజరయ్యేందుకు రవాణా వసతుల లేమి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల మంత్రులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సమీక్షించిన సుప్రీం కోర్టు అశోక్ భూషణ్, బీఆర్ గవై, కృష్ణ మురారీ నేతృత్వంలోని బెంచ్.. పిటిషన్లో యోగ్యత లేదని కొట్టేసింది. కాగా సెప్టెంబర్ 1 నుంచి జేఈఈ పరీక్షలు కొనసాగుతుండగా.. ఈ నెల 13న నీట్ పరీక్ష జరగనుంది.
Read More:
దర్శకుడికి ఫిక్స్ చేసుకున్న చెర్రీ.. దసరాకు ప్రకటన