ఈఎంఐలు కట్టేవారికి తీపి కబురు !
బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని, ఈఎంఐలు కట్టలేకపోతున్నవారికి సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. వచ్చే రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తితో ఎదురైన కష్టాల నుంచి రుణగ్రహీతలకు ఊరట లభించనుంది. బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని, ఈఎంఐలు కట్టలేకపోతున్నవారికి సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. వచ్చే రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు రెండు నెలలకుపైగా లాక్ డైన్ కొనసాగడం చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధి కూడా పోయింది. దేశ వ్యాప్తంగా కంపెనీలు, ఫ్యాక్టరీలు మూతపడి చాలా మంది ఉపాది కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ కూడా చతికిలపడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగం, ఉపాధి వెత్తుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో లోన్లు తీసుకున్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈఎంఐలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
లాక్ డౌన్ పిరియడ్ ని దృష్టిలో పెట్టుకొని లోన్ తీసుకున్న వారి కోసం ఈఎంఐ మారటోరియం సదుపాయాన్నికేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆగస్ట్ నెల చివరితోనే ఈ ప్రయోజనం గడువు తీరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈఎంఐలు కట్టాల్సిందే. ప్రభుత్వం పూర్తిగా లాక్ డైన్ ఎత్తివేసినా ఇంకా ఉపాధి దొరకని పరిస్థితి వుంది. చాలా మందికి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈఎంఐలు చెల్లించడం కష్టమే. అయితే ఇలాంటి వారికి సుప్రీం కోర్టు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాలుగా ప్రకటించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్ట్ 31 వరకు డిఫాట్ల్ కానీ బ్యాంక్ అకౌంట్లను మరో రెండు నెలల వరకు మొండి బకాయిలుగా ప్రకటించవద్దని సుప్రీం కోర్టు తెలిపింది. లోన్ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఈ కేసుపై సెప్టెంబర్ 10న మరోసారి వాదనలు జరగనున్నాయి. ఇకపోతే లోన్ ఈఎంఐ డబ్బులు వరుసగా 90 రోజులపాటు చెల్లించకపోతే అప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటిస్తారు.