Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Road Project: సైనికుల కోసం ఇది తప్పనిసరి.. చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు ఆమోదం..

చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టు కింద రెండు వరుసల రహదారి నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. బలగాల వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.

Chardham Road Project: సైనికుల కోసం ఇది తప్పనిసరి.. చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు ఆమోదం..
Chardham Road Project
Follow us
KVD Varma

|

Updated on: Dec 14, 2021 | 4:51 PM

Chardham Road Project: చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టు కింద రెండు వరుసల రహదారి నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. బలగాల వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలోని రహదారులకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో దేశ భద్రతకు తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, సైనికులు.. ఆయుధాల తరలింపు సులభంగా ఉండాలి అని కోర్టు చెప్పింది.

8 సెప్టెంబర్ 2020 నాటి ఆర్డర్‌ను సవరించడం ద్వారా కోర్టు ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు నిర్ధారించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె సిక్రి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అలాగే కమిటీ ఇచ్చిన సూచనలను పాటించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ పర్యవేక్షణ కమిటీకి రక్షణ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అన్ని జిల్లా మెజిస్ట్రేట్‌ల నుండి పూర్తి సహకారం లభిస్తుంది.

విపత్తును నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం..

ప్రాజెక్ట్ కారణంగా, హిమాలయ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడతాయనే ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. విపత్తుల నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని, దీనికి కేవలం రోడ్డు నిర్మాణమే బాధ్యత వహించదని స్పష్టం చేసింది.

సైనికుల సౌకర్యార్థం రోడ్డు నిర్మించాలని కొన్ని రోజుల క్రితం కేంద్రం సీల్డ్ కవర్‌ను కోర్టులో దాఖలు చేసింది. అందులో చైనా నిర్మించిన నిర్మాణ చిత్రాలు ఉన్నాయి. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ – చైనా వైపు నుంచి ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లు, ట్యాంకులు, సైనికులకు భవనాలు, రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, ఫిరంగులను మోసే ట్రక్కులు ఈ రోడ్ల ద్వారా వెళ్లవలసి ఉంటుంది, కాబట్టి రహదారి వెడల్పును 10 మీటర్లకు పెంచాలి అని ప్రభుత్వం తన వాదనలో పేర్కొంది.

1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధాన్ని కోర్టుకు గుర్తు చేసిన వేణుగోపాల్.. 1962లో ఏం జరిగిందో కోర్టుకు తెలుసునని అన్నారు. మేము సాయుధ దళాలు పరిస్థితిపై తీవ్రమైన దృష్టి పెట్టాలి. అప్పట్లో మన సైనికులు సరిహద్దు వరకు నడవాల్సి వచ్చింది అని వివరించారు.

చార్‌ధామ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలోని నాలుగు పవిత్ర స్థలాలను అన్ని వాతావరణాలలో అనుసంధానం చేయడం చార్‌ధామ్ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ప్రతి సీజన్‌లో చార్‌ధామ్ యాత్ర చేయవచ్చు. ఈ ప్రాజెక్టు కింద 900 కి.మీ పొడవునా రహదారిని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 400 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ జరిగింది.

ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు 25 వేల చెట్లు నరికివేశారని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) 26 సెప్టెంబర్ 2018 నాటి ఉత్తర్వును అనుసరించి సిటిజన్ ఫర్ గ్రీన్ డూన్ నీమ్ NGO సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కొండ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం లేదని ఎన్జీవో పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Cyber Attacks: ప్రభుత్వ సంస్థలపై ఎన్ని వేల సైబర్ దాడులు జరిగాయో తెలిస్తే ఉలిక్కి పడటం ఖాయం..

Antarctica: అంటార్కిటికా చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? సరిగ్గా 110 ఏళ్ల క్రితం ఈ విజయం సాధించారు!