Skymet Weather: ఈ ఏడాది హెల్తీ వెదర్.. రుతుపవనాల తీరును వెల్లడించిన స్కైమెట్

Monsoon: దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని స్కైమెట్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా మూడవ సంవత్సరం కూడా రుతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. స్కైమెట్ వాతావరణం మంగళవారం పలు..

Skymet Weather: ఈ ఏడాది హెల్తీ వెదర్.. రుతుపవనాల తీరును వెల్లడించిన స్కైమెట్
Skymet Weather
Follow us

|

Updated on: Apr 13, 2021 | 4:25 PM

దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని స్కైమెట్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా మూడవ సంవత్సరం కూడా రుతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.  ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర భారత దేశంలో వర్షాలు కొంత తక్కువగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

స్కైమెట్ వాతావరణ కేంద్రం వెల్లడించిన అంచనాల ప్రకారం వరుసగా మూడవ సంవత్సరం రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా స్థాయిలో ఉంటాని పేర్కొంది. 2021 నాటి ప్రాథమిక రుతుపవనలు ఎలా ఉండనున్నాయో తెలిపింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు దీర్ఘకాలిక సగటు (LPA) కంటే 103 శాతంకు అధికంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. స్కైమెట్ వెదర్ చెప్పిన లెక్కల ప్రకారం .. జూన్-జూలై-ఆగస్టు-సెప్టెంబర్లలో రుతుపవనాల సంభావ్యత 10 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. సాధారణం కంటే 15 శాతం అవకాశం (105 నుండి 110 శాతం మధ్య); సాధారణానికి 60 శాతం అవకాశం (96 నుండి 104 శాతం); సాధారణ కంటే 15 శాతం అవకాశం (90 నుండి 95 శాతం).

ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర భారతదేశంలో కొంత తక్కువగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, కర్ణాటకలోని అంతర్గత భాగాలలో జూలై నుంచి ఆగస్టు మధ్య ప్రధాన రుతుపవనాల నెలల్లో కొద్దిపాటి వర్షాలు కురుస్తాయి అని తెలిపింది. జూన్ ప్రారంభ నెలతోపాటు  సెప్టెంబర్ మాసంలో దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదు అవుతుందని భరోసా ఇస్తుంది స్కైమెట్ వెదర్.

స్కైమెట్ సీఈఓ యోగేశ్ పాటిల్ ప్రకారం చెప్పిన లెక్కల ప్రకారం “ గత సంవత్సరం నుండి పసిఫిక్ మహాసముద్రంలో లా నినా ప్రభావం ఉంటుందని తెలిపింది. అయితే వర్షాకాలం నాటికి ఇది తటస్థంగా ఉంటుందని భావిస్తున్నాం. ఎల్ నినో సంభవించడం సాధారణంగా రుతుపవనాలపై అధిక ప్రభావం ఉంటుంది. ” అని తెలిపారు. హిందూ మహాసముద్రం డిపోల్ (IOD) తటస్థంగా ఉన్నందున వర్షాకాలంకు ఉన్న నష్టం ఏమి లేదని పేర్కొంది.

అయితే ఎల్ నినోతోపాటు సదరన్ ఆసిలేషన్ (ENSO) అనేది సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలో ఆవర్తన హెచ్చుతగ్గులు ఉంటాయని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తెలిపింది.

ఇదిలావుంటే.. ఎల్ నినో సంభవించింది అనడానికి ఈ కింది పరిణామాలు సూచికలు…

1. హిందూ మహా సముద్రంపైనా ఉపరితల ఒత్తిడి పెరుగుతుంది.

2. మధ్య-తూర్పు పసిఫిక్ సముద్రం పైన ఉపరితల గాలి ఒత్తిడి పడిపోతుంది.

3. దక్షిణ పసిఫిక్ లోని వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. లేదా తూర్పుకు ప్రయాణిస్తాయి.

4. గాలి వేడెక్కి వాతావరణం పైకి ప్రయాణిస్తుంది. అక్కడ చల్లబడి వర్షాలు కురుస్తాయి.

5. సముద్ర ఉష్ణ జలాలు పశ్చిమ పసిఫిక్, హిందూ మహా సముద్రాల నుండి తూర్పు పసిఫిక్ కు విస్తరిస్తాయి. అవి తమతో పాటు వర్షాన్ని కూడా తీసుకెళ్తాయి. ఫలితంగా పశ్చిమ పసిఫిక్ తీరం, హిందూ మహా సముద్రం (ఇండియా) లలో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడడమే గాక సాధారణంగా వర్షం పెద్దగా కురవని పొడి ప్రాంతాల్లో కూడా వర్షం భాగా కురుస్తుంది.

అయితే.. భారీ వర్షాలు, వరదలతోపాటు కరువు వంటి వాతావరణం నమూనాలపై ENSO ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. ఎల్ నినో ప్రపంచ ఉష్ణోగ్రతలపై వేడెక్కే ప్రభావాన్ని కలిగి ఉంది, లా నినా వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు, భారతదేశంలో, ఎల్ నినో కరువు లేదా బలహీనమైన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంది, లా నినా బలమైన రుతుపవనాలతో మరియు సగటు వర్షాలు మరియు చల్లని శీతాకాలాలతో సంబంధం కలిగి ఉంది

IOD భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ద్వారా వర్గీకరించబడుతుంది; సానుకూల IOD పరిస్థితులు సాధారణంగా సాధారణ లేదా సాధారణ రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటాయి.

ఎల్-నినో ప్రభావం ఇండియాపైన ఉంటుంది. కానీ స్ధిరంగా ఉండదు. ఈ సంవత్సరం ఎల్ నినో ఏర్పడే అవకాశం 60 శాతం ఉన్నదని భారత వాతావరణ విభాగం రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఎల్ నినో సంభవించినప్పుడల్లా ఇండియాలో వర్షాభావం ఏర్పడుతుందన్న నియమం లేదు. కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపగా మరికొన్నిసార్లు పెద్దగా ప్రభావం చూపలేదు.

1997-98లో తీవ్ర స్ధాయి ఎల్ నినో సంభవించింది. కానీ ఇండియాపై ప్రభావం చూపలేదు. 2002లో ఒక మాదిరి ఎల్ నినో ఏర్పడగా ఇండియాలో తీవ్ర కరువు పరిస్ధితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే గత శతాబ్ద కాలంలో ఎల్ నినో వల్ల ఇండియాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. సగం కంటే ఎక్కువసార్లు దుర్భిక్ష పరిస్ధితులు ఏర్పడ్డాయి. అనగా ఎల్ నినో ప్రభావం భారత వ్యవసాయరంగాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

వర్షాకాలం వర్షాలు భారత దేశంలోని నికర సాగు విస్తీర్ణంలో 60% మందికి జీవనాధారంగా ఉంది. వీటికి నీటిపారుదల చాలా తక్కువగా ఉంటుంది. రుతుపవనాలు ప్రభావం ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, పారిశ్రామిక సంస్థలపై ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Jwala Gutta-Vishnu Vishal: పెళ్లిపీటలెక్కనున్న బ్యాట్మెంటన్ స్టార్.. వెడ్డింగ్ డేట్ చెప్పేసిన గుత్తా జ్వాలా

Water on Mars: అంగారక గ్రహంపై నీరు.. కీలక డేటాను సెండ్ చేసిన నాసా పర్సీవరెన్స్ రోవర్..