AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాకు చెక్.. చెన్నైలో స్పెషల్ డ్రైవ్.. 16 వేల మంది వర్కర్లతో ఇంటింటి స్క్రీనింగ్

కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా చెన్నైలో స్పెషల్ డ్రైవ్ చేబట్టింది. ఇంటింటి స్క్రీనింగ్ కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తమ శిక్షణ పొందిన 16 వేలమంది సిబ్బందిని నియమించింది.

కరోనాకు చెక్.. చెన్నైలో స్పెషల్ డ్రైవ్.. 16 వేల మంది వర్కర్లతో ఇంటింటి స్క్రీనింగ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 05, 2020 | 12:45 PM

Share

కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా చెన్నైలో స్పెషల్ డ్రైవ్ చేబట్టింది. ఇంటింటి స్క్రీనింగ్ కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తమ శిక్షణ పొందిన 16 వేలమంది సిబ్బందిని నియమించింది. వీరంతా ఆదివారం నుంచే ఇంటింటి స్క్రీనింగ్ చేపట్టడం ప్రారంభించారు. పర్సనల్ ప్రొటెక్టివ్ సూట్లు వగైరా ధరించిన ఈ సిబ్బంది అంతా ఎప్పటికప్పుడు ప్రతి రోజూ తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సిటీలో ఎవరెవరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారన్నది కూడా వీరి స్క్రీనింగ్ లో భాగమని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సిబ్బందిలో చాలామంది స్వయం సహాయక బృందాలవారని, వచ్ఛే 90 రోజుల్లో వీరు  సుమారు 10 లక్షల ఇళ్ళు , భవనాలలోని ప్రజలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

తమిళనాడులో శనివారం నాటికి మరో రెండు కరోనా డెత్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాత్ ఈవెంట్ కి వెళ్లిన 73 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కన్ఫార్మ్ అయిన కేసుల సంఖ్య 485 కి పెరిగింది. మహారాష్ట్ర (635) తరువాత ఇది రెండో రాష్ట్రమైంది. ఇప్పటివరకు తమిళనాడులో 4,248 సాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేశారు. సుమారు లక్ష మంది హోం ఐసోలేషన్ లో ఉండగా, 1681 మంది హాస్పిటల్ ఐసోలేషన్ లో ఉన్నారు.