AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెబ్బై ఏళ్ల తర్వాత ఆ గ్రామాలకు విద్యుత్ “సౌభాగ్యం”

దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సారాలు కావోస్తున్నప్పటికీ.. ఇంకా కొన్ని గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. అందుకు నిదర్శనం జమ్ముకశ్మీర్‌లోని కొన్ని కొండ ప్రాంతాలే. తాజాగా దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్..

డెబ్బై ఏళ్ల తర్వాత ఆ గ్రామాలకు విద్యుత్ సౌభాగ్యం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 6:45 AM

Share

దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సారాలు కావోస్తున్నప్పటికీ.. ఇంకా కొన్ని గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. అందుకు నిదర్శనం జమ్ముకశ్మీర్‌లోని కొన్ని కొండ ప్రాంతాలే. తాజాగా దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మొన్నటి వరకు కనీసం విద్యుత్ కూడా లేదు. కిల్లార్ ప్రాంతంలోని పలుగ్రామాల్లో.. దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలు విద్యుత్‌ను చూశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌభాగ్య పథకం ద్వారా.. కిల్లార్ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో విద్యుత్ లేని గ్రామాలను గుర్తించి.. వాటన్నింటికి విద్యుత్ సరఫరా ఏర్పాట్లను చేశారు అధికారులు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ అన్న పేరు విన్నాం కానీ.. ఇన్నాళ్లకు ఇప్పుడు మా గ్రామాల్లో కరెంట్‌ను చూస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఇక ఈ విద్యుత్‌ కాంతులతో తమ పిల్లలు చదువుకునేందుకు వీలుంటుందని అక్కడి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.