AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్: విశ్వాస పరీక్షకు ముందు ‘మహా’ డ్రామా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అర్ధరాత్రి మొదలైన కార్యాచరణకు ఉదయాన్నే ప్రమాణ స్వీకారంతో ముగింపునిచ్చిన బిజెపి.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోలుకోలేని షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో శివసేన, కాంగ్రెస్ పార్టీలు షాక్‌కు గురి కాగా.. ఎన్సీపీది నాటకమో.. లేక చీలికో అంతుచిక్కని పరిస్థితి. అయితే బలపరీక్షకు గవర్నర్ వారం రోజుల సమయం ఇవ్వగా.. నాలుగు ప్రధాన పార్టీలు బిజెపి, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అమీతుమీ తేల్చుకునేందుకు కొత్త రాజకీయానికి తెరలేపాయి. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ […]

బిగ్ బ్రేకింగ్: విశ్వాస పరీక్షకు ముందు ‘మహా’ డ్రామా?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 23, 2019 | 3:56 PM

Share

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అర్ధరాత్రి మొదలైన కార్యాచరణకు ఉదయాన్నే ప్రమాణ స్వీకారంతో ముగింపునిచ్చిన బిజెపి.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోలుకోలేని షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో శివసేన, కాంగ్రెస్ పార్టీలు షాక్‌కు గురి కాగా.. ఎన్సీపీది నాటకమో.. లేక చీలికో అంతుచిక్కని పరిస్థితి. అయితే బలపరీక్షకు గవర్నర్ వారం రోజుల సమయం ఇవ్వగా.. నాలుగు ప్రధాన పార్టీలు బిజెపి, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అమీతుమీ తేల్చుకునేందుకు కొత్త రాజకీయానికి తెరలేపాయి.

దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లిద్దరు తాము బలపరీక్షలో నెగ్గుతామని ప్రకటించగా.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీల నేతలు బిజెపివి నీచ రాజకీయాలంటూ ఘాటు విమర్శలకు దిగారు. అజిత్ పవార్‌ను ఎల్పీ లీడర్‌ పదవి నుంచి తప్పించారు శరద్ పవార్. ఎన్సీపీ ఎమ్మెల్యేలెవరు అజిత్ వెంట వెళ్ళరని శరద్ పవార్ చెబుతున్నారు. మరోవైపు శివసేనలో 19 మంది ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారని ప్రచారం జరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం బిజెపి (105) ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం (22) శివసేన చీలిక వర్గం (19) ఇండిపెండెంట్లు (8) కలిసి.. 154 మంది సపోర్టు తమకుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

ఎన్సీపీ అధినేత లెక్కలు మరోలా వున్నాయి. ఏదో అత్యవసర సమావేశం అంటే తమ ఎమ్మెల్యేలు 11 మంది అజిత్ పవార్‌తో వెళ్ళారని, వారిలో ముగ్గురు తిరిగి తమ క్యాంపులోకి వచ్చేశారని శరద్ పవార్ ప్రకటించారు. శివసేన మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా బిజెపితో వెళ్ళడం లేదని గట్టిగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎమ్మెల్యేలకు గిరాకీ పెద్ద స్థాయిలో పెరిగిపోయింది.

క్యాంపులకు ఎమ్మెల్యేలు..

బల పరీక్షకు వారం రోజుల వ్యవధి వుండడంతో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పని ప్రారంభించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్) ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. అటు బిజెపి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే ఇండిపెండెంట్లను, శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలమేయడం ముమ్మరం చేసినట్లు సమాచారం.

మొత్తమ్మీద ఈ వారం రోజుల డ్రామా తర్వాత ఎవరు నిజమైన విజేతలో.. ఎవరు పరాజితులో తేలిపోనుంది. అదేసమయంలో మహారాష్ట్ర పాలిటికల్ పిక్చర్‌లో మిగిలేదెవరో కూడా ఖరారు కానుంది.

Follow Us
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్