Watch: షాకింగ్ ఘటన.. రూ. 4 వేల పెట్రోల్ కోసం ఉద్యోగి ప్రాణాలతో ఆట.. CCTVలో భయానక దృశ్యాలు!
రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని కాందోలి పెట్రోల్ పంప్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన కొందరు వ్యక్తులు సుమారు రూ. 4 వేల విలువైన పెట్రోల్ పోయించుకుని, డబ్బులు చెల్లించకుండా పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-21 (NH-21) పక్కన ఉన్న కాందోలి పెట్రోల్ పంప్లో జరిగింది.

రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని కాందోలి పెట్రోల్ పంప్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన కొందరు వ్యక్తులు సుమారు రూ. 4 వేల విలువైన పెట్రోల్ పోయించుకుని, డబ్బులు చెల్లించకుండా పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-21 (NH-21) పక్కన ఉన్న కాందోలి పెట్రోల్ పంప్లో జరిగింది.
పెట్రోల్ పోయించిన అనంతరం యూపీఐ (UPI) ద్వారా చెల్లింపు చేస్తామని నిందితులు ఉద్యోగిని నమ్మించారు. ఆ తర్వాత మాటల్లో పెట్టి ఒక్కసారిగా కారును వేగంగా ముందుకు దూకించారు. పరిస్థితిని గుర్తించిన ఉద్యోగి కారును ఆపేందుకు ప్రయత్నించగా, అతడిని కారుతో కొంతదూరం ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని దౌసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి చేయి విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ దారుణ ఘటన మొత్తం పెట్రోల్ పంప్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దృశ్యాల్లో నిందితులు డబ్బులు చెల్లించకుండా పారిపోవడం, ఉద్యోగిని కారుతో ఈడ్చుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పెట్రోల్ పంప్ యాజమాన్యం, బాధిత ఉద్యోగి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు, వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
