Chocolates: కిరాణా షాప్‌లో గడువు ముగిసిన చాక్లెట్లు తిన్న చిన్నారి.. అంతలోనే రక్తం వాంతులు చేసుకుంటూ..!

|

Apr 21, 2024 | 9:19 AM

ఇంటి పక్కనున్న కిరాణా స్టోర్‌లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి చాక్లెట్‌ కొని తిన్నది. అయితే కాసేపటికే చిన్నారి రక్తం వాంతులు చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా ప్రమాదం తప్పింది. పోలీసులు, ఆరోగ్య శాఖ జరిపిన విచారణలో బాలిక తిన్న చాక్లెట్ల గడువు ముగిసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన చాక్లెట్లు అమ్మిన షాపులోని ఇతర చాక్లెట్లు, ఇతర తినుబండారాలను..

Chocolates: కిరాణా షాప్‌లో గడువు ముగిసిన చాక్లెట్లు తిన్న చిన్నారి.. అంతలోనే రక్తం వాంతులు చేసుకుంటూ..!
representative image
Follow us on

పాటియాలా, ఏప్రిల్ 21: ఇంటి పక్కనున్న కిరాణా స్టోర్‌లో కొన్నచాక్లెట్లను ఏడాదిన్నర వయసున్న చిన్నారి తిన్నది. అయితే కాసేపటికే చిన్నారి రక్తం వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా ప్రమాదం తప్పింది. పోలీసులు, ఆరోగ్య శాఖ జరిపిన విచారణలో బాలిక తిన్న చాక్లెట్ల గడువు ముగిసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన చాక్లెట్లు అమ్మిన షాపులోని ఇతర చాక్లెట్లు, ఇతర తినుబండారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో ఈ షాకింగ్‌ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

లూథియానాకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పాటియాలాలో బంధువుల ఇంటికి వెళ్లింది. విక్కీ గెహ్లాట్, స్థానిక కిరాణా దుకాణం నుంచి బాలిక కోసం బంధువులు చాక్లెట్ల బాక్స్‌ను కొనుగోలు చేశారు. సెండాఫ్‌ సందర్భంగా బంధువులు కొన్ని స్నాక్స్‌, చాక్లెట్లతో కూడిన బాక్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. లూథియానాకు తిరిగి వచ్చిన తర్వాత చిన్నారి బాక్స్‌ ఓపెన్‌ చేసి, అందులోని చాక్లెట్లను తిన్నది. దీంతో ఆ పాప ఒక్కసారిగా రక్తం వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిస్థితి విషమించడంతో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించగా గడువు ముగిసిన చాక్లెట్లు తినడం వల్లనే అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు, రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు.

ఆరోగ్య అధికారుల బృందం సదరు కిరాణా దుకాణానికి చేరుకుని నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించింది. తనిఖీల్లో దుకాణంలో గడువు ముగిసిన తినుబండారాలు విక్రయిస్తున్నట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దుకాణంలో గడువు ముగిసిన ఇతర చిరుతిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇదే ఏడాది మార్చిలో పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన బర్త్‌డే సందర్భంగా కేక్ తిని, ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కేక్‌ తిన్న బాలిక కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. విషపూరితంగా మారిన కేక్‌ తినడం వల్లనే బాలిక మృతి చెందినట్లు పోస్టుమార్టంలో నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.