AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్ల “ఢిల్లి” పోతున్న రాజధాని..హెల్త్ ఎమర్జెన్సీ ఎందుకంటే..?

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కి.. ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దగ్ధం.. మరోవైపు దీపావళి బాణసంచాల పేలుళ్లు. ఇంకోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ.. వెరిసి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఢిల్లీ. గతకొద్ది రోజులుగా కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో “హెల్త్ ఎమర్జెన్సీ” ప్రకటించింది. నవంబరు 5 వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. మరోవైపు కాలుష్యం […]

తల్ల ఢిల్లి పోతున్న రాజధాని..హెల్త్ ఎమర్జెన్సీ ఎందుకంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 01, 2019 | 4:44 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కి.. ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దగ్ధం.. మరోవైపు దీపావళి బాణసంచాల పేలుళ్లు. ఇంకోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ.. వెరిసి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఢిల్లీ. గతకొద్ది రోజులుగా కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో “హెల్త్ ఎమర్జెన్సీ” ప్రకటించింది. నవంబరు 5 వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. మరోవైపు కాలుష్యం దృష్ట్యా నవంబరు 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి(ఈపీసీఏ) ఛైర్మన్‌ భురేలాల్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిందని.. గురువారం రాత్రి నుంచి అక్కడ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని.. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని.. అందుకే ఈ ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నామని భురేలాల్‌ లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ, ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాల్లో అయిదు రోజులపాటు నిర్మాణ కార్యకలాపాలు, స్టోన్‌ క్రషర్లపై ఆంక్షలు విధించారు. అంతేకాదు.. ఈ శీతాకాలం ముగిసేవరకు బాణసంచా పేల్చడంపై నిషేధం విధించారు. బొగ్గు, ఇతర ఇంధన ఆధారిత పరిశ్రమలను కూడా మూసివేయాలంటూ ఈపీసీఏ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

అధికారిక డేటా ప్రకారం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే ‘బాగుంది’ అని, 51-100 మధ్య ఉంటే ‘సంతృప్తికరం’ అని, 101-200 మధ్య ఉండే ‘మధ్యస్తం’, 201-300 అయితే ‘బాగోలేదు’, 301-400 అయితే ‘ఏమాత్రం బాగోలేదు’, 401-500 మధ్య అయితే ‘ప్రమాదకరం’, 500పైన ఉంటే ‘ప్రమాదకరం-ప్లస్‌ ఎమర్జెన్సీ’గా పరిగణిస్తారు.

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ